Cyber Fraud: సైబర్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి లాటరీ తగిలిందని, లక్కీ డ్రా తీశామని, బంగారు, బంగారు నాణేలు వచ్చాయని చెప్పి మోసాలకు పాల్పడి దరఖాస్తుకు ఓటీపీ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తర్వాత ఆ మోసాలను ప్రజలు గ్రహించారు. అందుకే మోసగాళ్లు కూడా రూటు మార్చారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ చేయాలని, ఖాతా వివరాలను అప్డేట్ చేయమని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు, ఉద్యోగాల పేరుతో అనేక మోసాలు జరిగాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా రూటు మార్చారు. ఏది పడితే అది త్వరగా నమ్మే వారిని టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్లు ఇప్పుడు వారికి మంచి అవకాశంగా మారాయి.
Read also: Chicken Piece: పార్టీలో ప్రాణం తీసిన చిక్కెన్ ముక్క.. గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భీమా పథకాల దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆరు హామీల కోసం కోటి మందికి పైగా దరఖాస్తులు సమర్పించారు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలతో వీరిని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేరాలపై పోలీసులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని సమాచారం. ఇలాంటి మోసాలకు పాల్పడతారని పోలీసులు ముందుగానే హెచ్చరించడం చూశాం. కానీ, కొంత మంది మాత్రం సైబర్ నేరగాళ్ల వలలో పడిపోతూనే ఉన్నారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఓ మహిళ ఖాతా నుంచి రూ.10వేలు కొట్టేశారు. సంక్షేమ పథకం వర్తింపజేసేందుకు ఫోన్లో ఓటీపీ వచ్చిందన్నారు.
Read also: CM Revanth Reddy: పెట్టుబడులకు అవకాశం ఉంది..13 దేశాల ప్రతినిధులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఓటీపీ చెబితే దరఖాస్తు బాగానే వస్తుందని అబద్ధం చెప్పి.. ఆమె నుంచి ఓటీపీని కనుక్కున్నారు. ఇంకేముంది ఆమె ఖాతా నుంచి రూ.10,000 మాయం చేశారు. కాగా.. తెలంగాణలోని కోటి మందికి పైగా పౌరులు బీమా పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ దరఖాస్తులను నేరుగా అధికారులకు అందజేసి రశీదులు కూడా పొందారు. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన అధికారిక ఆపరేటర్లు ఈ వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ తర్వాత ఇంటింటికీ విచారణ ఉంటుంది. ఈ ఆరు హామీలకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. అర్హులైన వారందరికీ పథకాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ల ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు ఇవ్వవద్దని సూచించారు.
Drishti 10 Starliner Drone: హిందూ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రం వరకు భారత్ నేవీ ‘దృష్టి’