Bank Deposits Safety: బ్యాంకుల్లో డిపాజిట్లు సేఫేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని బ్యాంకుల్లో దాచుకుంటాం. కంచె చేనుమేసినట్టుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బులు భద్రమేనా..? మొన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తాజాగా డిసీసీ బ్యాంక్ లో కోట్ల రూపాయలు దారిమళ్లడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నెలలు గడిచినా కోట్ల రూపాయల విషయం పసిగట్టకపోవడానికి లోపం ఎవ్వరిది.. ? మరి నిఘా వేయాల్సిన అధికారులేం చేస్తున్నట్టు… ? స్కాం జరిగాక రికవరీ కోసం తపన తప్ప.. కేసుల జోలికెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల రెండు బ్యాంకుల్లో కోట్ల రూపాయలు కాజేసిన యవ్వారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది…మొన్నామధ్య తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మామిడి గూడ బ్రాంచ్ ఉద్యోగి సీఎస్పీ రమేష్, ముగ్గురు రైతుల కిసాన్ కార్డులతో ఏకంగా కోటి 28 లక్షలు మూడు నెలలుగా డ్రా చేశాడు…ఇది బ్రాంచ్ అధికారులే కాదు జిల్లాలోని ప్రధాన బ్యాంక్ అధికారులు సైతం గుర్తించ లేదు..తీరా రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించి సమాచారం ఇస్తే తప్పా, ఇక్కడి అధికారులు పసిగట్టలేకపోయారంటేనే డొల్లతనం అర్థమవుతోంది.
Also Read
- Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సవాళ్లు.. పట్టణంలో పోస్టర్లు కలకలం
- TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
- TGIIC Auction : హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆల్టైమ్ రికార్డు..!
ఇంత జరిగినా ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు..మారుమూల గ్రామమైన మామిడిగూడ వాసి సీఎస్పీ రమేష్ కోటి 28 లక్షలు డ్రా చేసాడు.దాంతో ఒక్కరిద్దరు ఇళ్లు కట్టేసుకున్నారు. ఇక రమేష్ అయితే తన బంధువులకు ట్రాన్స్ ఫర్ చేసాడు. ఇతరత్రా డబ్బులను వాడేసుకున్నాడు.అయితే అధికారులు రికవరీ మీద ధ్యాస పెట్టారు..కానీ పూర్తి స్తాయిలో డబ్బులు రికవరీ చేయలేదు..పైగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో, బ్యాంక్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలకు తావిస్తుంది.
తాజాగా డిసీసీ బ్యాంక్ బేల బ్రాంచ్ లో శ్రీపతి కుమార్ అనే ఉద్యోగి కేవలం ఓచర్లు లేకుండా ఐడీలు ఎంట్రీలతో రెండు కోట్ల 86 లక్షల 46 వేలు మాయం చేశాడు. తన బంధువులు, ఇతర బ్రాంచ్ ల్లో పనిచేసే అధికారుల అకౌంట్లలోకి బదిలీ చేశాడు. జిల్లా ఉన్నతాధికారులు ఆరు నెలల తర్వాత తీరిగ్గా గుర్తించారు. సెప్టెంబర్ 2021 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు గుర్తించలేకపోయారంటే అధికారుల పర్యవేక్షణ, బ్యాంక్ డబ్బులకు భద్రత ఎంత ఉందో అర్థమౌతుంది.
ఇప్పటి వరకు 11 మందిపై జిల్లా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అయితే రెండు కోట్ల 86 లక్షలు బ్యాంకు డబ్బులే అంటున్న అధికారులు, ఏ డబ్బులనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. డిసీసీ బ్యాంక్ లో జరిగిన కుంభకోణంలో ఎట్టకేలకు చర్యలకు దిగారు. ఈనెల 7న స్కాం వెలుగులోకి వస్తే, 13న పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది…పోలీసుల విచారిస్తే ఇంటిదొంగల గుట్ట రట్టయ్యే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
Rocket Explosion: బ్లూ ఆరిజిన్కు భారీ షాక్.. న్యూ గ్లెన్ రాకెట్ పరీక్షలో భారీ పేలుడు.!
-
AC Temperature Guidelines: విద్యుత్ బిల్లులకు చెక్..! ఏసీ ఎన్ని డిగ్రీల్లో వాడాలి..? ప్రభుత్వం సూచనలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!