Bank Deposits Safety: బ్యాంకుల్లో డిపాజిట్లు సేఫేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని బ్యాంకుల్లో దాచుకుంటాం. కంచె చేనుమేసినట్టుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బులు భద్రమేనా..? మొన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తాజాగా డిసీసీ బ్యాంక్ లో కోట్ల రూపాయలు దారిమళ్లడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నెలలు గడిచినా కోట్ల రూపాయల విషయం పసిగట్టకపోవడానికి లోపం ఎవ్వరిది.. ? మరి నిఘా వేయాల్సిన అధికారులేం చేస్తున్నట్టు… ? స్కాం జరిగాక రికవరీ కోసం తపన తప్ప.. కేసుల జోలికెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల రెండు బ్యాంకుల్లో కోట్ల రూపాయలు కాజేసిన యవ్వారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది…మొన్నామధ్య తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మామిడి గూడ బ్రాంచ్ ఉద్యోగి సీఎస్పీ రమేష్, ముగ్గురు రైతుల కిసాన్ కార్డులతో ఏకంగా కోటి 28 లక్షలు మూడు నెలలుగా డ్రా చేశాడు…ఇది బ్రాంచ్ అధికారులే కాదు జిల్లాలోని ప్రధాన బ్యాంక్ అధికారులు సైతం గుర్తించ లేదు..తీరా రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించి సమాచారం ఇస్తే తప్పా, ఇక్కడి అధికారులు పసిగట్టలేకపోయారంటేనే డొల్లతనం అర్థమవుతోంది.
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
ఇంత జరిగినా ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు..మారుమూల గ్రామమైన మామిడిగూడ వాసి సీఎస్పీ రమేష్ కోటి 28 లక్షలు డ్రా చేసాడు.దాంతో ఒక్కరిద్దరు ఇళ్లు కట్టేసుకున్నారు. ఇక రమేష్ అయితే తన బంధువులకు ట్రాన్స్ ఫర్ చేసాడు. ఇతరత్రా డబ్బులను వాడేసుకున్నాడు.అయితే అధికారులు రికవరీ మీద ధ్యాస పెట్టారు..కానీ పూర్తి స్తాయిలో డబ్బులు రికవరీ చేయలేదు..పైగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో, బ్యాంక్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలకు తావిస్తుంది.
తాజాగా డిసీసీ బ్యాంక్ బేల బ్రాంచ్ లో శ్రీపతి కుమార్ అనే ఉద్యోగి కేవలం ఓచర్లు లేకుండా ఐడీలు ఎంట్రీలతో రెండు కోట్ల 86 లక్షల 46 వేలు మాయం చేశాడు. తన బంధువులు, ఇతర బ్రాంచ్ ల్లో పనిచేసే అధికారుల అకౌంట్లలోకి బదిలీ చేశాడు. జిల్లా ఉన్నతాధికారులు ఆరు నెలల తర్వాత తీరిగ్గా గుర్తించారు. సెప్టెంబర్ 2021 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు గుర్తించలేకపోయారంటే అధికారుల పర్యవేక్షణ, బ్యాంక్ డబ్బులకు భద్రత ఎంత ఉందో అర్థమౌతుంది.
ఇప్పటి వరకు 11 మందిపై జిల్లా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అయితే రెండు కోట్ల 86 లక్షలు బ్యాంకు డబ్బులే అంటున్న అధికారులు, ఏ డబ్బులనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. డిసీసీ బ్యాంక్ లో జరిగిన కుంభకోణంలో ఎట్టకేలకు చర్యలకు దిగారు. ఈనెల 7న స్కాం వెలుగులోకి వస్తే, 13న పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది…పోలీసుల విచారిస్తే ఇంటిదొంగల గుట్ట రట్టయ్యే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
Romanchakam సక్సెస్ జోష్లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!