CPI Narayana: బాసర ట్రిపుల్ ఐటీలో నిర్బంధకాండ కొనసాగుతోంది
CPI Narayana: బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు సమ్మెలోకి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 6 వేల మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నారని ఆయన తెలిపారు. యూనివర్సిటీని పోలీసులు క్యాంపుగా మార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ లేదు, ల్యాప్టాప్లు లేవని, మెస్ సైతం సరిగ్గా లేదన్నారు. ఆహారం వికటించి ఈ మధ్య పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. వసతిగృహ కాంట్రాక్టులో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు వాటా ఉందని ఆయన ఆరోపించారు. మంత్రి సబిత పర్యటించినా కూడా లాభం లేదన్నారు. తాను రెండు సార్లు వెళ్లినా రానివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో.. మంత్రి కేటీఆర్ బెడ్పై ఉన్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీలో నిర్బంధకాండ కొనసాగుతోందన్నారు. సరైన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
Sabitha Indrareddy : మంత్రి సబిత నివాసం ముందు ఐఐఐటీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
Also Read
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు సీపీఐ సీనియర్ నేత నారాయణ బాసర ట్రిపుల్ విద్యార్థుల సమస్యల గురించి లేఖ రాశారు. ఆ లేఖలో వారి సమస్యలను వివరించారు. ఈ యూనివర్సిటీకి ఇప్పటికీ రెగ్యులర్ వైస్-ఛాన్సలర్ లేకపోవడం విస్మయకరమని… వెంటనే నియమించాలని కోరారు. వసతిగృహానికి సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. హాస్టల్ నిర్వహణ యూనివర్సిటీ చేతుల్లోనే ఉండాలని విద్యార్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులందరికీ తాజా కాన్ఫిగరేషన్తో కూడిన ల్యాప్టాప్లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు. 200కి పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని.. అన్ని తరగతులు మరియు ప్రాక్టికల్లు జరిగేలా పర్మినెంట్ టీచర్లను వెంటనే నియమించాలన్నారు. లైబ్రరీని అప్గ్రేడ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
-
Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!