తెలంగాణలో ప్రజాస్వామ్యానికి పాతర వేసింది కేసీఆర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష కు ఉపయోగపడే పాలన అని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయిందన్నారు. రాష్ట్రం ఆరంభంలోనే ఇది భౌగోళికంగా తెలంగాణ నా, ప్రజాస్వామ్య తెలంగాణ నా అనే చర్చ వచ్చింది. అయితే కేసీఆర్ విజయ వంతంగానే భౌగోళిక తెలంగాణ గానే ఉద్యమాన్ని నడిపించారని పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నిర్మాణాన్ని బలోపేతం చేసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాతీయ పార్టీగా సిపిఐ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాంతాలకు అతీతంగా ఒకే మాట మీద నిలబడిందని నారాయణ గుర్తు చేశారు. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో ఒక లైన్, ఆంధ్రాలో ఒక లైన్ తీసుకున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీలు పోరాటంతో పాటు కళాకారులు మేధావులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. సాంస్కృతిక ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం చారిత్రకం అని ,1500 మంది యువకులు బలిదానం చేసుకున్నారని అన్నారు. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే కాంగ్రెస్ పార్టీ తామే ఇచ్చామని చెప్పుకుందని అన్నారు. అన్ని పార్టీలు చేసిన పోరాటం మొత్తాన్ని కేసీఆర్ తన అకౌంట్లో వేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీని సైతం కేసీఆర్ చాలా తెలివిగా దూరంగా పెట్టారని అన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ప్రజాస్వామ్య ఉద్యమాలను కేసీఆర్ అణచివేయాలని చూస్తున్న తరుణంలో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధ పడుతోందన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో సైతం బిజెపి బలపడిందంటే అది కెసిఆర్ చేసుకున్న స్వయంకృతాపరాధమే అన్నారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర వహించిన కోదండరాం దూరమయ్యారని, నేడు ఈటెల రాజేందర్ బయటకు వచ్చారన్నారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించిన వారికి కేసీఆర్ పెద్దపీట వేశారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన రోజుల్లో కొన్ని ప్రాంతాలు దోపిడీకి గురవుతున్నాయని చెప్పిన నేతలు అదే ప్రాంతాల్లో దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు. నాడు పోరాడిన వాళ్లే నేడు కాంట్రాక్టర్ల అవతారమెత్తి దోచుకుంటున్నారని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!