CP CV Anand : ప్రతి ఏడాది రోడ్ ప్రమాదాల్లో 45 శాతానికి పైగా పాదాచరులే చనిపోతున్నారు
పాదచారుల కోసం పెలికాన్ సిగ్నళ్లను హైదరాబాద్ పోలీసులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని వేర్వేరు రోడ్లపై అమర్చారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్ను హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించడం లేదన్నారు. ట్రాఫిక్ లో రోడ్ దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ చాలా ఉపయోగపడుతాయని, అందుకే.. హైదరాబాద్ లో 30 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పెలికాన్ సిగ్నల్ వద్ద వాలెంటీర్స్ ఉంటారని, ప్రతి ఏడాది రోడ్ ప్రమాదాల్లో 45 శాతానికి పైగా పాదాచరులే చనిపోతున్నారన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది పాధాచరులు చనిపోయారని ఆయన వెల్లడించారు. రోడ్ దాటుతున్న సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే పెలికాన్ సిగ్నల్ ద్వారా రోడ్ ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
Also Read : Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
మహిళల భద్రత గురించి సేఫ్ సిటీ ప్రాజెక్టు లో ఎన్నో తీసుకోని వచ్చామని, పాదాచరుల కోసం పెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుందని, మూడు కమిషనరేట్ పరిధిలో ఇలాంటివి సిగ్నల్ సిస్టమ్ లు ఉన్నాయన్నారు సీపీ ఆనంద్. ఈ పెలికన్ సిగ్నలింగ్ సిస్టమ్స్ దగ్గర ట్రైన్ అయిన వారిని ఉంచుతున్నామని, కొన్ని దేశాల్లో ఇలాంటి సిస్టమ్ ఆటోమేటిక్ గా వుంటుందన్నారు. కానీ.. ఇక్కడ ట్రాఫిక్ పై అంత అవగాహన లేదూ… అందుకే ప్రతి సిగ్నలింగ్ సిస్టమ్ వద్ద ట్రైన్ అయిన వారు ఆపరేట్ చేస్తూ ఉంటారన్నారు. పాదచారుల కోసం నగరంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి… ఫుట్ ఓవర్ బ్రిడ్జి లునున్నయి..కానీ వాటిని ఎవరూ వాడట్లేదన్నారు. ఎక్కడ పాదచారుల కోసం ఫుట్ పాత్ లు ఉండట్లేదు.. 500 గజాలు లేకుండ అంత షాప్ లతో , టాయ్లెట్ లతో ఉండిపోతుందన్నారు. ప్రభుత్వం ఎన్నో చేస్తుంది… ట్రాఫిక్ వాళ్ళని ఆదుకుంటుందని, నగర ప్రజలకు అవగాహన అవసరమన్నారు. ఈ సిగ్నల్ వ్యవస్థ పాదాచరులు ఎక్కువ ఉన్న చోట ఏర్పాటు చేస్తున్నామని, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ ల కోసం బ్యాగ్ కిట్, బాడీ ఓన్ కెమెరా లు కిట్స్ అందించామని ఆయన తెలిపారు. ఎండ లో ఉంటూ ఎంతో చేస్తున్న వీరికి ప్రభుత్వం 30 శాతం ఎక్కువ జీతాలు ఇస్తుందని, బాడీ ఓన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ వయోలెటర్స్ బిహేవియర్ అన్ని తెలుస్తాయన్నారు.
Also Read : “NIPPO” తన స్వర్ణోత్సవ వేడుక వేదికగా సరికొత్త “Brand logo” ఆవిష్కరణ
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Stock Market Rally: ఎన్నికల ఫలితాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ జోరు.. 800 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
-
BCCI: ఐపీఎల్ ఆటగాళ్ల ‘గర్ల్ఫ్రెండ్ కల్చర్’పై బీసీసీఐ సీరియస్.. హార్దిక్, యశస్వి, ఇషాన్, అర్ష్దీప్లకు బిగ్ షాక్!
-
Jai Hanuman: ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో ధురంధర్ నటుడు..
-
TMC: 2011 ఎన్నికలతో చరిత్ర సృష్టించిన టీఎంసీ.. 30 సీట్ల నుంచి 184 సీట్లకు.. మమతా బెనర్జీ విజయగాథ
-
PSL 2026 Final: తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర.. కెప్టెన్గా తొలి పీఎస్ఎల్ ట్రోఫీ అందుకున్న బాబర్ ఆజం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!