Jubilee Hills Pub Case: మరో కీలక పరిణామం… నిందితులకు డీఎన్ఏ టెస్ట్లకు కోర్టు ఓకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఆమ్నిషాయా పబ్ రేప్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితుల డీఎన్ఏ సేకరణను అనుమతి ఇచ్చింది కోర్టు.. బాలికపై గ్యాంగ్ రేపు కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు.. నిందితుల డీఎన్ఏ సేకరణ కోఎసం అనుమతికోరుతూ కోర్టును ఆశ్రయించగా.. డీఎన్ఏ సేకరణకు కోర్టు అనుమతి ఇచ్చింది.. దీంతో, నిందితుల నుంచి డీఎన్ఏ సేకరించనున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇప్పటికే బాలికపై అత్యాచారం జరిగిన ఇన్నోవా కారులో ఆధారాలు సేకరించారు పోలీసులు… డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత వాహనంలోని ఆధారాలతో పోల్చనున్నారు పోలీసులు..
Read Also: YSRCP: అధికార పార్టీలో ఉన్న ఆ అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి గిట్టదా..?
Also Read
ఇక, ఈ కేసు విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్ గా డీఎన్ఏ రిపోర్ట్ కీలకంగా మారనుంది.. అవసరమైతే బాధితురాలి డీఎన్ఏను కూడా సేకరించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఈ ఘటనపై కోర్టులో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు.. నిందితుల పాస్పోర్ట్లను సైతం సీజ్ చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.. నిందితులకు బెయిల్ లభిస్తే దేశం వదిలి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురి బెయిల్ పిటీషన్ను కోర్టు తిరస్కరించిన విషయం విదితమే.. కాగా, మే 28వ తేదీన మైనర్ బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు ప్రధాన నిందితుడు సాదుద్దీన్ను పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం మైనర్లు జువైనల్ హోంలో.. సాదుద్దీన్ చంచల్గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!