రాజన్న సిరిసిల్లాలో దారుణం : అత్తకు కరోనా.. కోడలును బలవంతంగా కౌగిలించుకుని మరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలీగుత్త తండా వాసితో మూడేళ్ళ కింద పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల కింద ఒడిశా వెళ్ళాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవరు గా పని చేస్తున్నాడు. అయితే 5 రోజుల కింద ఏ అత్తకు కరోనా సోకింది. దీంతో అత్త హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు సామాజిక దూరం పాటించడాన్ని అత్త భరించలేకపోయింది, ఇంకేముంది తన శాడిజం చూపింది. కోడలిని తరచూ కౌగిలించుకుంది. దీంతో ఆ కోడలికి కూడా కరోనా సోకింది. అంతే కాదు చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేశారు. ఈ దారుణాన్ని గ్రహించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కోడలు, అత్త హోం క్వారంటైన్లో ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!