మాదాపూర్ గుట్టల బేంగంపేట వడ్డెర కాలనీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం 20మంది వాంతులు, వీరేచనాలు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇప్పుడు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. అంతేకాకుండా బాధితులు లో 30 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కలుషిత నీరు తాగడం వలనే అనారోగ్యంకి కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అందరూ ఒకే లక్షణాలు తో హాస్పిటల్ లో చేరడంతో కాలనీ వాసుల ఆరోపణలపై ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాధితులు వాంతులు, విరేచనాలు, జ్వరం తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. బస్తీ దవాఖాన, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఇదే కాలనీకి చెందిన భీమయ్య రెండు రోజులు క్రితం ఇదే లక్షణాలతో మృతి చెందడంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు భూమయ్య కుటుంబంలో మరొక ఇద్దరు ఇదే లక్షణాలు తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాటర్ పొల్యూషన్ జరగలేదని జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఫుడ్ పాయిజన్, వాటర్ పాయిజన్ అయితేనే ఇలాంటి కంప్లైంట్ లు వస్తాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. మరి సమస్య గుర్తించాలని కాలనీవాసులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాలనీ విడిచి వెళ్ళిపోవడం తప్ప మరో దారి లేదంటున్న కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.