MLC Jeevan Reddy : ప్రజాదరణ చూడలేకే ఈడీ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీని గత కొన్ని రోజులుగా ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా జగిత్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర ఉద్యమ సమయంలో జవహర్ లాల్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించారని ఆయన వెల్లడించారు. నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ తరపున 90 కోట్ల రూపాయలు చెల్లించిందని ఆయన అన్నారు. యంగ్ ఇండియా కంపెనీ ద్వారా ఒక్క రూపాయి కూడా లావాదేవీలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా.. నేషనల్ హెరాల్డ్ కష్టాలలో ఉన్నప్పుడు 90 కోట్లు ఇచ్చి షేర్లు బదిలీ మాత్రమే చేసారని ఆయన తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ పేరుతో ఈడీ రాహుల్ గాంధీకి వరుసగా విచారణ పేరుతో బీజేపీ ప్రభుత్వం మానసికంగా ఒత్తిడి చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశంలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకొని మానసింకంగా ఒత్తిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో జనతా సర్కార్ ఇందిరా గాంధీని మానసికంగా హింసించారని ఆయన విమర్శించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని హింసిస్తోందని ఆయన అన్నారు. ఈడీ విచారణను ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!