Jagga Reddy: డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్కే వేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో.. మద్యం ఏరులైపారుతోంది.. డబ్బులు పోటీపడి పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే.. బేరసారాలపై వార్తలు రాగా.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. ఇది మరింత పెరిగిందట.. అయితే, డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మీడియా చిట్చాట్లో ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పే కుట్ర నడుస్తుందని ఫైర్ అయ్యారు.. ఇక, మునుగోడులో జరిగిన అభివృద్ధి అంతా పాల్వాయి గోవర్ధన్రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు.. టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దూషణలతో పోటీ రెండు పార్టీల మధ్యే ఉందనే కలర్ ఇస్తున్నాయని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి.
Read Also: Chiranjeevi: గరికిపాటి వివాదంపై తొలిసారి రియాక్షన్.. అవసరం లేదంటూ తేల్చేశారు
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్లో రోడ్డెక్కిన యువత
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
టీఆర్ఎస్, బీజేపీ కుట్రలను మునుగోడు ప్రజలు గమనించాలని సూచించారు జగ్గారెడ్డి.. ఇక, కాంగ్రెస్ నేతలకు ఉన్నంత నిబద్ధత టీఆర్ఎస్, బీజేపీలకు ఉండదన్న ఆయన.. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్లు అవుతారన్నారు.. మరోవైపు.. బీజేపీ మతం పెరుతో రెచ్చ గొడుతుంది అని మండిపడ్డారు.. టీఆర్ఎస్ ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేయించుకుంటుందని విమర్శించారు. ప్రజలు ఆలోచన చేయండి.. ఉప ఎన్నికలో తాత్కాలిక సంతోషం కోసం చూడకండి.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటు వేయాలన్నారు.. డబ్బులు ఎవరిచ్చినా మీవే తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు జగ్గారెడ్డి. కాగా, రేపటితో మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఇప్పటికే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ను లేకుండా చేయాలని ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డ ఆయన.. వంద కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వాడుతున్నాయని… మోడీ- కేసీఆర్ స్థాయిలోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Moto G Max: భారత్ లో మోటో జి మ్యాక్స్ విడుదల.. స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 చిప్, 7,000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్స్ ఇవే
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
JoJo : ‘జోజో’ ఫస్ట్ లుక్.. ‘మనోభావాల బ్యాచ్’కి స్వీట్ వార్నింగ్
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
ట్రెండింగ్
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!