Jagga Reddy: డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్కే వేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నికలో.. మద్యం ఏరులైపారుతోంది.. డబ్బులు పోటీపడి పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే.. బేరసారాలపై వార్తలు రాగా.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. ఇది మరింత పెరిగిందట.. అయితే, డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మీడియా చిట్చాట్లో ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పే కుట్ర నడుస్తుందని ఫైర్ అయ్యారు.. ఇక, మునుగోడులో జరిగిన అభివృద్ధి అంతా పాల్వాయి గోవర్ధన్రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు.. టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దూషణలతో పోటీ రెండు పార్టీల మధ్యే ఉందనే కలర్ ఇస్తున్నాయని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి.
Read Also: Chiranjeevi: గరికిపాటి వివాదంపై తొలిసారి రియాక్షన్.. అవసరం లేదంటూ తేల్చేశారు
Also Read
టీఆర్ఎస్, బీజేపీ కుట్రలను మునుగోడు ప్రజలు గమనించాలని సూచించారు జగ్గారెడ్డి.. ఇక, కాంగ్రెస్ నేతలకు ఉన్నంత నిబద్ధత టీఆర్ఎస్, బీజేపీలకు ఉండదన్న ఆయన.. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్లు అవుతారన్నారు.. మరోవైపు.. బీజేపీ మతం పెరుతో రెచ్చ గొడుతుంది అని మండిపడ్డారు.. టీఆర్ఎస్ ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేయించుకుంటుందని విమర్శించారు. ప్రజలు ఆలోచన చేయండి.. ఉప ఎన్నికలో తాత్కాలిక సంతోషం కోసం చూడకండి.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటు వేయాలన్నారు.. డబ్బులు ఎవరిచ్చినా మీవే తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు జగ్గారెడ్డి. కాగా, రేపటితో మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఇప్పటికే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ను లేకుండా చేయాలని ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డ ఆయన.. వంద కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వాడుతున్నాయని… మోడీ- కేసీఆర్ స్థాయిలోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!