Chiranjeevi: గరికిపాటి వివాదంపై తొలిసారి రియాక్షన్.. అవసరం లేదంటూ తేల్చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar Chiranjeevi Responds On Garikipati Narasimha Rao Controversy: ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫోటో సెషన్ ఆపకపోతే నేను వెళ్లిపోతా’ అంటూ ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! మెగాభిమానులతో పాటు కొందరు సినీ తారలు సైతం ఆయన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. మెగాబ్రదర్ నాగబాబు కూడా రంగంలోకి దిగి.. పరోక్షంగా గరికిపాటిపై చురకలు అంటించారు. ‘ఏ పాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ని చూస్తే.. ఆపాటి అసూయ కలగడం పరిపాటే’నని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. తనని తాను చిరంజీవికి వీరాభిమానినని చెప్పుకునే రాంగోపాల్ వర్మ సైతం ట్విటర్ మాధ్యమంగా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. గరికిపాటిని గడ్డిపరక అంటూ సెటైర్లు వేశాడు. చిరు జోలికొస్తే ఉపేక్షించేదే లేదని హెచ్చరించాడు కూడా. ఇలా ఈ వివాదం రోజురోజుకు వేడుక్కుతూనే ఉంది.
అయితే.. ఇంత జరుగుతున్నా, ఇప్పటిదాకా చిరంజీవి మాత్రం దీనిపై నోరు మెదపలేదు. అయితే.. తాజాగా తొలిసారి ఈ వివాదంపై ఆయన పెదవి విప్పారు. ‘‘ఆయన (గరికిపాటి నరసింహారావు) పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’’ అని చెప్పారు. దీంతో.. ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలికినట్లయ్యింది. చూస్తుంటే.. అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికిపాటి చేసిన వ్యాఖ్యలను చిరంజీవి అసలు సీరియస్గా తీసుకోలేదని కనిపిస్తోంది. ఏదైతేనేం.. చిరు రెస్పాన్స్తో దీనికి చెక్ పడినట్లైంది. ఇక ఇదే సమయంలో.. ఆచార్య ఫ్లాప్ మీద చిరు మరోసారి రెస్పాండ్ అయ్యారు. తాము నటించే సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే, దాని పూర్తి బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘ఆచార్య’ ఫ్లాప్ అయినందుకు తానేమీ బాధపడలేదని.. ఆ సినిమా పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను, చరణ్ 80 శాతం పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశామని తెలిపారు.
Also Read
- Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
- Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
అలాగే.. తాను రాజకీయాల్లో లేకపోవడం వల్ల బాగానే ఉన్నానని, ఒకవేళ ప్రజారాజ్యం పార్టీలో కొనసాగి ఉండుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక దానికే పరిమితం అయ్యేవాడినని చిరు అన్నారు. నటుడిగా గతంలో ఎలాంటి ఆదరణ ఉందో.. ఇప్పుడు కూడా అదే ఆదరణ తెలుగు రాష్ట్రాల్లో ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదలవుతాయన్నారు. మార్చి నుంచి కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభిస్తానని.. బాబీ సినిమాలో తన రోల్ ఫుల్ మాస్ లుక్లో ఉంటుందని చెప్పారు. మోషన్ పోస్టర్ని దీపావళి రోజున విడుదల చేస్తామని చిరు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!