ఇది రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం : బోరెడ్డి అయోధ్య రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100 యూనిట్లు వాడే వినియోగదారుల మీద 39.50 శాతం భారం పడనుందని ఆయన తెలిపారు. 800 యూనిట్లకు పైగా విద్యుత్ ను వాడే వినియోగదారుల మీద 8.9 శాతం మాత్రమే అదనంగా భారాన్ని మోపుతున్నారాని ఆయన అన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం అన్ని ఆయన మండిపడ్డారు.
72.50 రూపాయల చార్జీలు చెల్లిస్తున్న పేదలు ఏప్రిల్ నుంచి 112.50 చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు ఖాళీగా ఉంటే ఇప్పుడు నెలకు 55 రూపాయలను కనీస చార్జీ ఉంది. అది వచ్చే నెల నుంచి 150 రూపాయలు చెల్లించాలి. ఇది 173 శాతం అదనంగా పెంచారు. తక్కువ ధరతో రామగుండం ప్లాంటు నుంచి కొనడం ఆపేసి భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నుంచి ఎక్కువ ధరకు కొంటామని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. విద్యుత్ 84,222 మిలియన్ యూనిట్లు అవసరం అని పంపిణీ సంస్థలు అంటున్నాయి. గత ఏడాది కన్నా ఇది16.69 శాతం ఎక్కువ. ఇంత విద్యుత్ వినియోగం ఉండదు. జెన్ కో సంస్థలు కేవలం 55 శాతమే సామర్ధ్యం ఉత్పత్తి చేస్తున్నది. ఉత్పత్తి సామర్ధ్యము పెంచితే కొనాల్సిన అవసరం తక్కువ. 698 విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. దీనికి 529 కోట్లు పరిహారం. భద్రతా చర్యలు లేక పోవడం వల్ల ఈ దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..