KK Report : కేకే సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఆగ్రహం..
- కేకే సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఆగ్రహం
- ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందని ఆరోపణ
- కేటీఆర్, హరీష్ డైరెక్షన్లో సర్వే విడుదల
- ఎలక్షన్ కమిషన్ వద్దకు ఫిర్యాదు : బల్మూరి వెంకట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి సర్వేలను ప్రచురించడం నిషేధమని గుర్తు చేశారు. అయితే కేకే సర్వే ఉద్దేశపూర్వకంగానే విడుదలైందని, ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేకే సర్వే రెండు గంటల్లోనే తయారు చేసిన ఒక లిస్ట్ను “సర్వే రిపోర్ట్”గా విడుదల చేసిందన్నారు. ఇది పూర్తిగా కేటీఆర్, హరీష్ రావు డైరెక్షన్లో జరిగిన చర్య అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ సర్వే ఉపయోగపడిందని అన్నారు.
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
గతంలో హర్యానాలో కూడా కేకే సర్వే సంస్థ ఇలాగే అడ్డగోలుగా సర్వేలను విడుదల చేసి, ఫలితాలు అసలు వాస్తవాలకు పొంతన లేకుండా ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు సర్వేల ద్వారా ప్రజల అభిప్రాయాలను మలుపు తిప్పే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. కేకే సర్వే సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆర్ఓను కోరిన ఎమ్మెల్సీలు, రేపు ఎలక్షన్ కమిషన్ కమిషనర్ను ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపనున్నట్లు చెప్పారు. “జూబ్లీహిల్స్లో ఓటమి ఖాయం అని తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి డ్రామాలకు దిగుతున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మా అభ్యర్థి ఘన విజయాన్ని సాధిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది,” అని బల్మూరి వెంకట్ అన్నారు.
తాజావార్తలు
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!