KK Report : కేకే సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఆగ్రహం..
- కేకే సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఆగ్రహం
- ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందని ఆరోపణ
- కేటీఆర్, హరీష్ డైరెక్షన్లో సర్వే విడుదల
- ఎలక్షన్ కమిషన్ వద్దకు ఫిర్యాదు : బల్మూరి వెంకట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి సర్వేలను ప్రచురించడం నిషేధమని గుర్తు చేశారు. అయితే కేకే సర్వే ఉద్దేశపూర్వకంగానే విడుదలైందని, ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేకే సర్వే రెండు గంటల్లోనే తయారు చేసిన ఒక లిస్ట్ను “సర్వే రిపోర్ట్”గా విడుదల చేసిందన్నారు. ఇది పూర్తిగా కేటీఆర్, హరీష్ రావు డైరెక్షన్లో జరిగిన చర్య అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ సర్వే ఉపయోగపడిందని అన్నారు.
Also Read
- Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
- Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
- Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
గతంలో హర్యానాలో కూడా కేకే సర్వే సంస్థ ఇలాగే అడ్డగోలుగా సర్వేలను విడుదల చేసి, ఫలితాలు అసలు వాస్తవాలకు పొంతన లేకుండా ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు సర్వేల ద్వారా ప్రజల అభిప్రాయాలను మలుపు తిప్పే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. కేకే సర్వే సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆర్ఓను కోరిన ఎమ్మెల్సీలు, రేపు ఎలక్షన్ కమిషన్ కమిషనర్ను ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపనున్నట్లు చెప్పారు. “జూబ్లీహిల్స్లో ఓటమి ఖాయం అని తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి డ్రామాలకు దిగుతున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మా అభ్యర్థి ఘన విజయాన్ని సాధిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది,” అని బల్మూరి వెంకట్ అన్నారు.
తాజావార్తలు
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
-
Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
-
Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
-
Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!