Bhatti Vikramarka: కాంగ్రెస్ చింతన్ శిబిర్.. అంతా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు.
2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించి తీర్మానాలు చేయనున్నారు.హైకమైండ్ ఆదేశాలతో పీసీసీ నేతలు 2 రోజుల పాటు చింతన్ శిబిర్ ఏర్పాటు చేశారు. కీసరలోని బాలవికాసలో నవ సంకల్ప్ చింతన్ శిబిర్ జరగనుంది. ఇందుకోసం పీసీసీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ ఆమోదించిన 6 తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Also Read
- Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
ఆరు కమిటీలలో ఒక్కో కమిటీలో 30 నుంచి 40 మంది నేతలున్నారు. ఆర్గనైజేషన్ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య, యూత్ కమిటీకి దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొలిటికల్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సోషల్ జస్టిస్ కు వీహెచ్ లు కన్వీనర్లుగా ఉన్నారు.
మొదటి రోజు సమావేశాల్లో 6 కమిటీలు సమావేశమై..వారికిచ్చిన అంశాలపై రిపోర్ట్ ప్రిపేర్ చేయనున్నారు. రెండో రోజు 6 కమిటీల కన్వీనర్లు మొదటి రోజు తయారు చేసిన రిపోర్ట్ ను భట్టి నేతృత్వంలోని చింతన్ శిబిర్ నిర్వహణ కమిటీకి అందజేయనున్నారు. చివరగా చింతన్ శిబిర్ తీర్మానాలను ఆమోదించి ఏఐసీసీకి పంపనున్నారు. మొత్తం దాదాపు 150 మందికి మాత్రమే పీసీసీ ఆహ్వానం పంపింది. పార్టీ అధిష్టానం తరపున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నారు.
తాజావార్తలు
-
Tollywood : ఆదుకున్న కరుప్పు, దృశ్యం 3.. ఐదు నెలలుగా హిట్ లేని తెలుగు ఇండస్ట్రీకి ‘పెద్ది’ సక్సెస్ తీసుకొస్తుందా?
-
Iran Vs America War: 3 నెలలు.. తె*గిపడ్డ వేలాది తలలు..అంతర్జాతీయ మీడియా షాకింగ్ నివేదిక!
-
Telangana Rains: తెలంగాణలో అకాల వర్షాల మోత.. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ.!
-
ED Raids: కేరళం రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు..
-
Rana Daggubati: రానా ఫుడ్ హ్యాబిట్స్ వింటే షాక్ అవ్వాల్సిందే.. ఏం తిన్నాడో తెలుసా?
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!