Donald Trump: ఇజ్రాయెల్పై ట్రంప్ ఫైర్.. ఖతార్తో జాగ్రత్త అంటూ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ నాయకులను నిర్మూలించడానికి ఇజ్రాయెల్ ఎక్కడి వరకైనా వెళ్తుందని స్పష్టంగా చెప్పారు. తమ పోరాటంలో అమెరికా భాగస్వామ్యం ఉంటుందని చెప్పడంతో, ఇప్పుడు దోహాపై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దాడిపై ట్రంప్ ఏవిధంగా స్పందించాడో చూద్దాం..
READ ALSO: Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత మొదటిసారి ట్రంప్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఖతార్ అమెరికాకు స్నేహితుడు అని దానిపై దాడి చేసే ముందు బాగా ఆలోచించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. గల్ఫ్ దేశంగా, ఖతార్తో అమెరికాకు కీలక భాగస్వామ్యం ఉందని ఆయన గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో ఇజ్రాయెల్ దానిపై దాడి చేస్తే కీలక పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఇప్పటి నుంచి ఖతార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్.. ఖతార్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హమాస్ కోసం ఏదో ఒకటి చేయాలి కానీ, ఖతార్ అమెరికాకు గొప్ప భాగస్వామి అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని చెప్పారు. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని గొప్ప వ్యక్తి అని ఆయన అభివర్ణించారు. ట్రంప్ ఖతార్ను అమెరికాకు గొప్ప భాగస్వామి అని పేర్కొవడంతో, నెతన్యాహు ఈ సమస్యను తెలివిగా పరిష్కరించుకోవడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు.
తాజాగా సోమవారం నుంచి ఖతార్ రాజధాని దోహాలో సుమారుగా 50 ముస్లిం దేశాలు సమావేశం కానున్నాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఈ సంఖ్యలో ముస్లిం దేశాలు దోహాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఖతార్ ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించింది. అలాగే ఇది మధ్యవర్తిత్వం ప్రాథమిక సూత్రంపై దాడి అని పేర్కొంది. ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థాని ఈ దాడిని ఉగ్రవాద చర్యగా, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు.
READ ALSO: Medchal : గచ్చిబౌలిలో ప్రహారీ గోడ కూలి ఒకరు మృతి, నలుగురుకి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!