CM Revanth Reddy : అమెరికా – తెలంగాణ బంధం మరింత బలపడాలి
- అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ హాజరు
- తెలంగాణ–అమెరికా బంధాన్ని బలోపేతం చేయాలన్న సీఎం ఆకాంక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమెరికా స్వాతంత్ర్యం ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని ప్రశంసించారు.
అమెరికా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలవడమే కాకుండా, ఆవిష్కరణలకు నాంది పలికిన దేశంగా ఎదిగిందని రేవంత్ పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించని ఆత్మవిశ్వాసం అమెరికా స్ఫూర్తికి చిహ్నమని, అదే తరహాలో తెలంగాణ కూడా స్నేహబద్ధమైన బంధాలను కోరుకునే, వాటిని మరింత బలపరిచే రాష్ట్రంగా ఎదుగుతోందని అన్నారు.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్లో స్థాపించబడిందని గుర్తు చేసిన సీఎం, అప్పటి నుంచీ అమెరికా – భారత్ సంబంధాలు దౌత్య పరంగా బలపడుతున్నాయన్నారు. తెలుగుభాషకు అమెరికాలో విశేష ఆదరణ లభిస్తుండటమే ఈ బంధానికి నిదర్శనమని తెలిపారు.
Vishwambhara : ఓజీ ఓకే.. విశ్వంభర ఎప్పుడో..?
ఈ సందర్భంగా హైదరాబాద్లోని కాన్సూల్ జనరల్ శ్రీమతి జెన్నిఫర్ లార్సన్ ప్రజల మధ్య, వాణిజ్య సంబంధాల మధ్య వారధిగా నిలుస్తున్నారన్నారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ రంగాల్లో దాదాపు 200 అమెరికన్ కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్నే కేంద్రంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. దీనికోసం అమెరికా మద్దతు కూడా కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నమ్మకం, విలువలపై ఆధారపడిందని, ప్రపంచ శాంతిని నెలకొల్పడం, పెట్టుబడుల పెంపు, ప్రజాస్వామ్య విస్తరణ వంటి రంగాల్లో ఈ సంబంధాలు మరింతగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సైనిక వినియాసాలు, అంతరిక్ష పరిశోధనలు, సాంకేతిక రంగాల్లో సహకారం ఇప్పటికే ఉన్నట్లు పేర్కొన్నారు.
“ఒక్కటిగా ఉంటే.. మరింత పటిష్ఠంగా ఎదగగలము” అనే ఈ వేడుకల థీమ్ను ప్రతిబింబిస్తూ, తెలంగాణ – అమెరికా బంధం కూడా అదే దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!