CM KCR: ప్రతి డివిజన్లో ఆధునిక మార్కెట్లు.. కల్తీ బెడద లేకుండా చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech In Telangana Assembly On Hyderabad Markets: హైదరాబాద్లో మార్కెట్లో విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనాభాకు అనుగుణంగా నగరంలో మార్కెట్లు లేవని, గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని, అవి కూడా శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని విమర్శించారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న భాగ్యనగరంలో సరిపడా వెజ్, నాన్వెజ్ మార్కెట్లు లేవన్నారు. మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదన్నారు. ఈ నేపథ్యంలోనే సమీకృత వెజ్ & నాన్వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని, అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు.
Legislative Council: మండలిలో జీవన్ రెడ్డి vs తలసాని.. ముందు నీ శాఖ చూసుకో
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
నిజాం హయాంలో నిర్మించిన మోండా మార్కెట్ ఓ అద్భుతం అని, దాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని కేసీఆర్ అన్నారు. ఆహార పదార్థాలపై బ్యాక్టీరియాలు దాడి చేయకూడదన్న ఉద్దేశంతో.. సైంటిఫిక్ రీసెర్చ్తో డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ని ఇంగ్లీష్వాళ్లు తీసుకొచ్చారన్నారు. అలాంటి కాన్సెప్ట్తోనే మోండా మార్కెట్ని నిర్మించారన్నారు. కనీసం రెండున్నర అడుగుల ఎత్తులో నిత్యావసర వస్తువుల్ని అక్కడ అమ్ముతుంటారన్నారు. మోండా మార్కెట్ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లని అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామని తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని కూడా చెప్పారు.
Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు
ఇదే సమయంలో కల్తీ విత్తనాల బెడద లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. కల్తీ విత్తనాలు మహబూబ్ నగర్లోని ఎక్కువగా ఉందని మండిపడ్డారు. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ పెట్టామని తెలియజేశారు. పీడీ యాక్ట్ ఎందుకని కేంద్రం ప్రశ్నించిందని.. తాము ఒప్పించి దాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. కల్తీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రణాళికలు చేపడతామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!