CM KCR: ప్రతి డివిజన్లో ఆధునిక మార్కెట్లు.. కల్తీ బెడద లేకుండా చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR Speech In Telangana Assembly On Hyderabad Markets: హైదరాబాద్లో మార్కెట్లో విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనాభాకు అనుగుణంగా నగరంలో మార్కెట్లు లేవని, గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవని, అవి కూడా శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు నిర్మించారని విమర్శించారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న భాగ్యనగరంలో సరిపడా వెజ్, నాన్వెజ్ మార్కెట్లు లేవన్నారు. మురికిలో, మట్టి, దుమ్ములో కూరగాయలు అమ్మే పరిస్థితి ఉండేదన్నారు. ఈ నేపథ్యంలోనే సమీకృత వెజ్ & నాన్వెజ్ మార్కెట్లకు శ్రీకారం చుట్టామని, అధునాతన కూరగాయల మార్కెట్లు ప్రతి నియోజకవర్గంలో తేవాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు.
Legislative Council: మండలిలో జీవన్ రెడ్డి vs తలసాని.. ముందు నీ శాఖ చూసుకో
Also Read
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
నిజాం హయాంలో నిర్మించిన మోండా మార్కెట్ ఓ అద్భుతం అని, దాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని కేసీఆర్ అన్నారు. ఆహార పదార్థాలపై బ్యాక్టీరియాలు దాడి చేయకూడదన్న ఉద్దేశంతో.. సైంటిఫిక్ రీసెర్చ్తో డైనింగ్ టేబుల్ కాన్సెప్ట్ని ఇంగ్లీష్వాళ్లు తీసుకొచ్చారన్నారు. అలాంటి కాన్సెప్ట్తోనే మోండా మార్కెట్ని నిర్మించారన్నారు. కనీసం రెండున్నర అడుగుల ఎత్తులో నిత్యావసర వస్తువుల్ని అక్కడ అమ్ముతుంటారన్నారు. మోండా మార్కెట్ని కలెక్టర్లందరికీ చూపించామని, అలాంటి మార్కెట్లని అన్ని జిల్లాల్లో నిర్మించాలని సూచించామని తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నారాయణపేట కూరగాయల మార్కెట్ చాలా అద్భుతంగా కట్టినట్లు తాను విన్నానని కూడా చెప్పారు.
Hyderabad Fake Baba Arrest: దొంగ బాబా అరెస్ట్.. 8వ పెళ్లి చివరి క్షణంలో బాగోతం బట్టబయలు
ఇదే సమయంలో కల్తీ విత్తనాల బెడద లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. కల్తీ విత్తనాలు మహబూబ్ నగర్లోని ఎక్కువగా ఉందని మండిపడ్డారు. కల్తీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ పెట్టామని తెలియజేశారు. పీడీ యాక్ట్ ఎందుకని కేంద్రం ప్రశ్నించిందని.. తాము ఒప్పించి దాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. కల్తీ విత్తనాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రణాళికలు చేపడతామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!