Independence Day Celebrations: తెలంగాణలో అద్భుత ఘట్టం.. సామూహిక గీతాలాపణతో సందడిగా నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రమంతా ఒకేసారి ప్రజల జాతీయగీతాలాపనతో నగరమంతా పండుగ వాతావరణ కనిపించింది. ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి, పనిచేస్తున్న ప్రదేశంలో.. బస్సుల్లో, మెట్రో రైలు లో నిలబడి గీతాలాపన చేసారు. సామూహిక జాతీయ గీతాలాపనతో నగరంలో అన్ని కూడళ్ళలో సందడి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాలు తో ర్యాలీగా వచ్చిన విద్యార్థులు. అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజయవంతం చేశారు.
సిద్దిపేట జిల్లాలో సామూహిక జాతీయ గీతాలపన నిర్వహించారు. నర్సాపూర్ లో ఒకే తటిచెట్టుపైకి జాతీయ జెండాలతో ఎక్కిన 20 మంది గీతా కార్మికులు జాతీయ జెండాను చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. చెట్టుపైనే జాతీయ గీతాలాపన చేసారు. జిల్లాలోని పంట పొలాల్లో జాతీయ గీతాలపన నిర్వాహించారు పలువురు. పొలంలోనే జాతీయ జెండాలు సెల్యూట్ చేస్తూ.. జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు.
Also Read

ఎన్టీవీ కార్యాలయంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యాలయంలో టీం మెంబర్స్ పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో కూడా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. సామూహిక జాతీయ గీతాలాపనలో బండి సంజయ్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక సికింద్రబాద్ గాంధీ ఆసుపత్రిలో సైతం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో.. పేషంట్లు సైతం నిలబడి జాతీయ గీతాలాపన చేయడం అందరిని ఆకట్టుకుంది. హైటెక్ సిటీ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతపట్టి షెల్యూట్ కొడుతూ జాతీయ గీతాలాపణ చేసారు.
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జనగణమన పాడిన ఈటెల రాజేందర్ షామీర్పేటలోని తన నివాసంలో ఈటెలకు కలవడానికి వచ్చిన నాయకులుచ అభిమానులతో కలిసి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన కోసం పలు చోట్లు నుంచి వచ్చిన వారికి, అక్కడ నుంచి నిలిపివేసిన, ట్రాఫిక్ మళ్లింపు చేసిన ట్రాఫిక్ నుంచి క్లియర్ చేయడానికి సమయం పట్టే విధంగా వుందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సాధారణ పరిస్థితి కి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం వున్నందున ప్రయాణికులు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
-
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
-
TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..