Independence Day Celebrations: తెలంగాణలో అద్భుత ఘట్టం.. సామూహిక గీతాలాపణతో సందడిగా నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రమంతా ఒకేసారి ప్రజల జాతీయగీతాలాపనతో నగరమంతా పండుగ వాతావరణ కనిపించింది. ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి, పనిచేస్తున్న ప్రదేశంలో.. బస్సుల్లో, మెట్రో రైలు లో నిలబడి గీతాలాపన చేసారు. సామూహిక జాతీయ గీతాలాపనతో నగరంలో అన్ని కూడళ్ళలో సందడి వాతావరణం నెలకొంది. జాతీయ జెండాలు తో ర్యాలీగా వచ్చిన విద్యార్థులు. అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని విజయవంతం చేశారు.
సిద్దిపేట జిల్లాలో సామూహిక జాతీయ గీతాలపన నిర్వహించారు. నర్సాపూర్ లో ఒకే తటిచెట్టుపైకి జాతీయ జెండాలతో ఎక్కిన 20 మంది గీతా కార్మికులు జాతీయ జెండాను చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. చెట్టుపైనే జాతీయ గీతాలాపన చేసారు. జిల్లాలోని పంట పొలాల్లో జాతీయ గీతాలపన నిర్వాహించారు పలువురు. పొలంలోనే జాతీయ జెండాలు సెల్యూట్ చేస్తూ.. జాతీయ గీతాలాపన చేసి దేశభక్తిని చాటారు.
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!

ఎన్టీవీ కార్యాలయంలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యాలయంలో టీం మెంబర్స్ పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో కూడా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. సామూహిక జాతీయ గీతాలాపనలో బండి సంజయ్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక సికింద్రబాద్ గాంధీ ఆసుపత్రిలో సైతం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో.. పేషంట్లు సైతం నిలబడి జాతీయ గీతాలాపన చేయడం అందరిని ఆకట్టుకుంది. హైటెక్ సిటీ చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతపట్టి షెల్యూట్ కొడుతూ జాతీయ గీతాలాపణ చేసారు.
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జనగణమన పాడిన ఈటెల రాజేందర్ షామీర్పేటలోని తన నివాసంలో ఈటెలకు కలవడానికి వచ్చిన నాయకులుచ అభిమానులతో కలిసి జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన కోసం పలు చోట్లు నుంచి వచ్చిన వారికి, అక్కడ నుంచి నిలిపివేసిన, ట్రాఫిక్ మళ్లింపు చేసిన ట్రాఫిక్ నుంచి క్లియర్ చేయడానికి సమయం పట్టే విధంగా వుందని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సాధారణ పరిస్థితి కి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం వున్నందున ప్రయాణికులు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!