Cm Kcr: బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి బహిరంగ సభ లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోదామా జాతీయ రాజకీయాల్లోకి అంటూ కేసీఆర్ ప్రజల్ని అడిగారు. పెద్ద పల్లి జిల్లాలో కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కలలో కూడా పెద్దపల్లి జిల్లా అవుతుంది అనుకోలేదు. తెలంగాణ స్వరాష్ట్రం రావడం తో జిల్లా గా మార్చుకోగలిగాం. దేశం ఆశ్చర్య పోయే విదంగా అనేక కార్యక్రమాలు తెలంగాణాలో చేసుకుంటున్నాం… సింగరేణి లో కార్మికులకు బోనస్ లు ఇస్తున్నాం .,పెద్దపల్లి ,మంథని పట్టణాలను మున్సిపాలిటిగా చేసుకున్నాం అన్నారు.
బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి…..మేధావులు, యువకులు మేల్కొనాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి.. దేశాన్ని కాపాడడానికి అంతా ముందుకు పోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలి. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనే బీజేపీని ఓడించాలి.. నిన్న మొన్న 26 రాష్ట్రాల రైతు నాయకులతో మాట్లాడాను.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళు కోరారు . గుజరాత్ మాడల్ అంటూ దేశం లో అధికారం లోకి వచ్చిన మోడీ అన్ని ధరలు పెంచుతున్నారు. పాలు ,పెరుగుపై కూడా GST వేసి లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారు. దేశ సంపదని గద్దల్లా తింటున్నారు …
Also Read
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
తెలంగాణ లో చేస్తున్న ఏ కార్యక్రమం దేశం లో ఏ ఇతర రాష్ట్రము లో లేదు. బూట్లు మోసే గులాములు తెలంగాణ లో కనపడుతున్నారు..ధాన్యం కొనమంటే కొనలేదు …ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో బియ్యం ,గోధుమ పిండికి డిమాండ్ ఉంది. తెలంగాణ లో మత విద్వేషాలు రెచ్చగుడుతున్నారు.. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వెళ్లి రైతు ప్రభుత్వం వస్తుంది..నరేంద్ర మోదీకి మీటర్లు పెట్టాలి..చెప్పులు మోసే వెదవలు కూడా కారు కూతలు కూస్తున్నారు.. గుజరాత్ లో కల్తీ మద్యంపై ప్రధాని మోడీ స్పందించాలన్నారు సీఎం కేపీఆర్.
Read Also: Nandamuri Balakrishna: బ్రేకింగ్.. బాలకృష్ణ నిర్మాతలకు సుప్రీం కోర్టు నోటీసులు
2024 లో బీజేపీ ముక్తు భారత్ కు సన్నద్ద పడాలి.. గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పి మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది..మత పిచ్చిగాళ్ళు ఉన్మాదల నుండి మనం కాపాడుకోవాలి..చెప్పులు మోయమని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు..పెద్దపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు..పేద ప్రజలను మోసం చేసి దగ్గర లక్షలు కోట్లు దోచుకున్నారు. సింగరేణి కార్మిక లోకం గళమెత్తి కన్నెర్ర జేయాలన్నారు. దేశం మొత్తం రాష్ట్ర అద్భుత ప్రగతిని చూస్తోంది.. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు నాతో చర్చలు జరిపారు.. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచేసింది. అన్నిటిమీద జీఎస్టీ.. పేద ప్రజల ఉసురు పోసుకుంటోంది. లక్షల రూపాయల రుణాలు ఎన్పీయేల పేరుతో రద్దుచేస్తున్నారు. తెలివితక్కువ కేంద్రం వల్ల గోధుమలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఒకసారి మోసపోతే గోసపడతాం. కూలగొట్టడం చాలా తేలిక.. కట్టడం చాలా కష్టం అన్నారు సీఎం కేసీఆర్.
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!