Cm Kcr: బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి
పెద్దపల్లి బహిరంగ సభ లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోదామా జాతీయ రాజకీయాల్లోకి అంటూ కేసీఆర్ ప్రజల్ని అడిగారు. పెద్ద పల్లి జిల్లాలో కలెక్టరేట్, టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కలలో కూడా పెద్దపల్లి జిల్లా అవుతుంది అనుకోలేదు. తెలంగాణ స్వరాష్ట్రం రావడం తో జిల్లా గా మార్చుకోగలిగాం. దేశం ఆశ్చర్య పోయే విదంగా అనేక కార్యక్రమాలు తెలంగాణాలో చేసుకుంటున్నాం… సింగరేణి లో కార్మికులకు బోనస్ లు ఇస్తున్నాం .,పెద్దపల్లి ,మంథని పట్టణాలను మున్సిపాలిటిగా చేసుకున్నాం అన్నారు.
బీజేపీ ముక్త్ భారత్ కు అంతా కదిలిరావాలి…..మేధావులు, యువకులు మేల్కొనాలి. ప్రజల్ని చైతన్యవంతం చేయాలి.. దేశాన్ని కాపాడడానికి అంతా ముందుకు పోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని పారద్రోలాలి. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలనే బీజేపీని ఓడించాలి.. నిన్న మొన్న 26 రాష్ట్రాల రైతు నాయకులతో మాట్లాడాను.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళు కోరారు . గుజరాత్ మాడల్ అంటూ దేశం లో అధికారం లోకి వచ్చిన మోడీ అన్ని ధరలు పెంచుతున్నారు. పాలు ,పెరుగుపై కూడా GST వేసి లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారు. దేశ సంపదని గద్దల్లా తింటున్నారు …
Also Read
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
- Telangana Fuel Supply : తెలంగాణలో ఇంధన సంక్షోభానికి సర్కార్ చెక్
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
తెలంగాణ లో చేస్తున్న ఏ కార్యక్రమం దేశం లో ఏ ఇతర రాష్ట్రము లో లేదు. బూట్లు మోసే గులాములు తెలంగాణ లో కనపడుతున్నారు..ధాన్యం కొనమంటే కొనలేదు …ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో బియ్యం ,గోధుమ పిండికి డిమాండ్ ఉంది. తెలంగాణ లో మత విద్వేషాలు రెచ్చగుడుతున్నారు.. రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వెళ్లి రైతు ప్రభుత్వం వస్తుంది..నరేంద్ర మోదీకి మీటర్లు పెట్టాలి..చెప్పులు మోసే వెదవలు కూడా కారు కూతలు కూస్తున్నారు.. గుజరాత్ లో కల్తీ మద్యంపై ప్రధాని మోడీ స్పందించాలన్నారు సీఎం కేపీఆర్.
Read Also: Nandamuri Balakrishna: బ్రేకింగ్.. బాలకృష్ణ నిర్మాతలకు సుప్రీం కోర్టు నోటీసులు
2024 లో బీజేపీ ముక్తు భారత్ కు సన్నద్ద పడాలి.. గుజరాత్ రోల్ మోడల్ అని చెప్పి మోసం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది..మత పిచ్చిగాళ్ళు ఉన్మాదల నుండి మనం కాపాడుకోవాలి..చెప్పులు మోయమని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు..పెద్దపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు..పేద ప్రజలను మోసం చేసి దగ్గర లక్షలు కోట్లు దోచుకున్నారు. సింగరేణి కార్మిక లోకం గళమెత్తి కన్నెర్ర జేయాలన్నారు. దేశం మొత్తం రాష్ట్ర అద్భుత ప్రగతిని చూస్తోంది.. 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలు నాతో చర్చలు జరిపారు.. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచేసింది. అన్నిటిమీద జీఎస్టీ.. పేద ప్రజల ఉసురు పోసుకుంటోంది. లక్షల రూపాయల రుణాలు ఎన్పీయేల పేరుతో రద్దుచేస్తున్నారు. తెలివితక్కువ కేంద్రం వల్ల గోధుమలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఒకసారి మోసపోతే గోసపడతాం. కూలగొట్టడం చాలా తేలిక.. కట్టడం చాలా కష్టం అన్నారు సీఎం కేసీఆర్.
తాజావార్తలు
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!