CM KCR: సివిల్స్లో సత్తాచాటిన తెలుగు తేజాలు.. సీఎం అభినందనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించింది. ఉత్తమ ర్యాంకులు సాధించి సివిల్స్కు ఎంపికైన విద్యార్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు…వీరంతా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇక సివిల్స్లో తృతీయ ర్యాంక్ సాధించిన ఉమా హారతిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకున్న అనుబంధాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. ఉమా హారతి విజయవంతం చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
Read also: Bhatti Vikramarka: జడ్చర్ల నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర.. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలన
Also Read
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
UPSC మే 23న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిషోర్ టాపర్గా నిలిచింది. అదే సమయంలో బీహార్కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానంలో నిలిచారు. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో, అస్సాంకు చెందిన మయూర్ హజారికా ఐదో స్థానంలో, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరో స్థానంలో నిలిచారు. UPSC 2022 పరీక్ష ఫలితాలు ఈరోజు (మే 23) విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సివిల్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. UPSC 2022లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 345 మంది జనరల్ కోటా నుండి, 99 మంది EWS నుండి, 263 మంది OBC నుండి, 154 మంది SC నుండి మరియు 72 మంది ST వర్గం నుండి ఎంపికయ్యారు. ఈ సివిల్స్ లో ఇషితా కిషోర్ మొదటి ర్యాంక్ సాధించింది. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్., స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో సత్తా చాటారు. ఇక మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి తెలంగాణకు చెందినవారు.
తాజావార్తలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!