CM KCR: సివిల్స్లో సత్తాచాటిన తెలుగు తేజాలు.. సీఎం అభినందనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేటకు చెందిన ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి మూడో ర్యాంకు సాధించింది. ఉత్తమ ర్యాంకులు సాధించి సివిల్స్కు ఎంపికైన విద్యార్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభినందించారు…వీరంతా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇక సివిల్స్లో తృతీయ ర్యాంక్ సాధించిన ఉమా హారతిపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకున్న అనుబంధాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. ఉమా హారతి విజయవంతం చేసినందుకు ఆమె కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
Read also: Bhatti Vikramarka: జడ్చర్ల నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర.. ఉద్దండపూర్ ప్రాజెక్టు పరిశీలన
Also Read
- Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
- Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై 'ఈగల్ ఫోర్స్' ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
UPSC మే 23న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CSE 2022) తుది ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిషోర్ టాపర్గా నిలిచింది. అదే సమయంలో బీహార్కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానంలో నిలిచారు. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో, అస్సాంకు చెందిన మయూర్ హజారికా ఐదో స్థానంలో, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరో స్థానంలో నిలిచారు. UPSC 2022 పరీక్ష ఫలితాలు ఈరోజు (మే 23) విడుదలయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సివిల్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. UPSC 2022లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 345 మంది జనరల్ కోటా నుండి, 99 మంది EWS నుండి, 263 మంది OBC నుండి, 154 మంది SC నుండి మరియు 72 మంది ST వర్గం నుండి ఎంపికయ్యారు. ఈ సివిల్స్ లో ఇషితా కిషోర్ మొదటి ర్యాంక్ సాధించింది. గరిమా లోహియా, ఉమా హారతి ఎన్., స్మృతి మిశ్రా తర్వాతి నాలుగు ర్యాంకుల్లో సత్తా చాటారు. ఇక మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి తెలంగాణకు చెందినవారు.
తాజావార్తలు
-
Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
-
Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!