Fake Passport Scam: నకిలీ పాస్ పోర్టు స్కామ్.. పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిఐడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Passport Scam: నకిలీ పాస్ పోర్టు స్కామ్ తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం సృష్టిస్తుంది. నకిలీ పాస్ పోర్టు స్కామ్ కేసును అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద మొత్తంలో శ్రీలంకకి నకిలీ పాస్ పోర్టు తీసుకుని వెళ్లినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్టు కేంద్రంగా 92 జారీ అయినట్లు గుర్తించారు. కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే 14 మందిని అరెస్టు చేసిన సిఐడి.. మరికొందరు కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడుకు చెందిన ఏజెంట్ మురళీధరన్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. మురళీధర్ ద్వారా పాస్ పోర్ట్ స్కాం జరిగినట్లు సీఐడీ గుర్తించింది.
Read also: Challa Vamshi Reddy: డీకే.అరుణ నా ఫోన్ లిప్ట్ చేయలేదు.. చల్లా సంచలన వ్యాఖ్యలు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
పాస్ పోర్ట్స్ కేసులో సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్ తెలిపారు. ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసామన్నారు. తమిళనాడు స్టేట్ చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధరన్, ద్వారా నకిలీ పాస్ పోర్ట్ రాకెట్ గుర్తించామన్నారు. శ్రీలంక దేశస్తులు ఎక్కవ మంది అడ్డదారిలో పాస్పోర్ట్స్ పొందారని తెలిపారు. ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టమని, తమిళనాడు ఏజెంట్ మురళీధరన్, హైదరాబాద్ చెందిన సత్తార్ నకిలీ పత్రలు సృష్టించి హైదరాబాద్ కి పంపారని తెలిపారు. వివిధ జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్ లతో పాటు తమిళనాడు మెయిన్ బ్రోకర్ అదుపులోకి తీసుకున్నామన్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్ట్ పొందినట్లు గుర్తించామని తెలిపారు.
Read also: Fake Social Media Profile: రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు.. సీవీ ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్
కొందరు విదేశీయులకు నకిలీ ఐడి ప్రూఫ్ పెట్టి పాస్ పోర్ట్ ఇప్పించినట్లు గుర్తించామని అన్నారు. 92 మంది పాస్పోర్టులు గుర్తించాము ఇందులో కొంతమంది తీసుకొని విదేశాలకు వెళ్లిపోయారని తెలిపారు. పాస్ పోర్ట్ పొందిన వారిలో ఎక్కువగా శ్రీలంక దేశానికి చెందిన వారు ఉన్నట్టు గుర్తించామన్నారు. పాస్ పోర్ట్ లు ఇప్పించడంలో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల హస్తం ఉన్నట్టుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసామని తెలిపారు. పలువురు ఎస్బి, పాస్పోర్ట్ సిబ్బంది పాత్ర పై ఆరా తీస్తున్నమని తెలిపారు. 92 మందికి నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందినట్టు గుర్తించామని అన్నారు. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ కేంద్రంగా 92 నకిలీ పాస్ పోర్ట్ జారీ అయ్యాయని తెలిపారు. 12 మంది నిందితులను ఐదు రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిందని, పాస్పోర్ట్ స్కామ్ కేసు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
Rohit Sharma: కెరీర్లో ఏనాడూ ఎన్సీఏకు వెళ్లలేదు.. విరాట్ కోహ్లీని చూసి యువ క్రికెటర్లు నేర్చుకోవాలి: రోహిత్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!