Telangana:రాజన్న ఆలయం వద్ద దారుణం.. 28 రోజుల శిశువు కిడ్నాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్నసిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేములవాడ రాజన్న ఆలయం వద్ద గుర్తు తెలియని దుండగులు శిశువును అపహరించారు. 28 రోజుల శిశువును అపహరించిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య వేములవాడ రాజన్న ఆలయం మెట్లమీద ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా ఒంటరిగా ఉంటుంది.
కుటుంబ కలహాలతో లావణ్యను వదిలి వెల్లిపోయాడు భర్త. దీంతో అదే అలుసుగా భావించిన కొందరు దుండగులు ఈఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి వేకువజామున శిశువును అపహరించినట్లు సమాచారం. బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. వరంగల్ లో అనుమానాస్పదంగా ఉన్నవారివద్ద శిశువును పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఇలాంటి ఘటనే 4 April 2017 లో చోటుచేసుకుంది. రాజన్న సన్నిధానంలో 11నెలల బాలుడు కిడ్నాప్ గురవ్వడం కలకలం రేపింది. అయతే కిడ్నాప్ గురైన 15 గంటల్లోనే పోలీసులు కిడ్నాప్ ఉదంతానికి తెరదించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లికి చెందిన వరాల ఉమాయాదగిరిల కుమారుడు వరుణ్ తేజ తలనీలాలు సమర్పించుకుంటామని వారు రాజన్నకు మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకోడానికి ఆదివారం వారి స్వంత ఊరు నుంచి వేములవాడకు వచ్చారు.
రాత్రి ఆలయ ఆవరణలో నిద్రించారు. అర్ధరాత్రి 2గంటల సమయంలో తల్లిపక్కలో నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ ఎత్తుకొని వెళ్లింది. ఆ తర్వాత మెలుకువ వచ్చిన బాలుడి తల్లి ఉమ తన పక్కలో ఉండాల్సిన బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మికాంతపురం గ్రామంలో ఓ మహిళ వద్ద బాలుడి ఆచూకీ లభించినది. పోలీసులు వెంటనే ఆ బాలుడిని తీసుకుని, కిడ్నాప్కు పాల్పడిన ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.
Anekal Balraj: మార్కింగ్ వాకింగ్ కి వెళ్లి మృతువాత పడ్డ ప్రముఖ నిర్మాత
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!