Chaganti Koteswara Rao : ‘ఇది మర్యాద కాదు’ అంటూ చాగంటి ఫైర్..
- వేదికపై అసహనం వ్యక్తం చేసిన చాగంటి కోటేశ్వరరావు
- రోశయ్య జయంతి సభలో ఫోటోల కోసం హడావిడి
- "సభకు గౌరవం ఉండాలి" అంటూ చాగంటి ఘాటు స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaganti Koteswara Rao : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో ప్రముఖ ధార్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా జరిగిన సభలో చాగంటి ప్రసంగిస్తున్న సమయంలో, వేదికపై అభిమానులు, నాయకులు గుంపులుగా చేరి ఫోటోలు తీయడం ప్రారంభించడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాగంటిని సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించేందుకు వేదికపైకి వచ్చారు. అయితే, ఆయన వెనుక పలువురు నిలబడి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించడంతో, ప్రసంగాన్ని ఒక్కసారిగా ఆపిన చాగంటి, ఆ ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
Tamil Nadu Custodial Death: వెలుగులోకి పోస్ట్మార్టం రిపోర్ట్.. ఆందోళన కలిగిస్తున్న అంశాలు
“ఇది ఓ మహానుభావుడి జయంతి సభ. ఇక్కడి వేదికకు ఓ గౌరవం ఉండాలి. ఈ సమయంలో వెనుక నిలబడి ఫోటోలు తీయడం అనుచితం. మీరు దయచేసి కిందకు వెళ్లి కూర్చోండి,” అని ఆయన కాస్త గట్టి స్వరంతో సూచించారు. ఆయన మాటలతో సభలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది. అనంతరం చాగంటి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రోశయ్యతో తనకు ఉన్న సాన్నిహిత్యం, ఆయనలోని వినయాన్ని గుర్తుచేశారు.
తమిళనాడులో గవర్నర్గా ఉన్న సమయంలో రోశయ్య స్వయంగా తనను రాజభవన్కు ఆహ్వానించి గౌరవించారని, అది తనకు మరపురాని సంఘటనగా నిలిచిపోయిందని చాగంటి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!