Tamil Nadu Custodial Death: వెలుగులోకి పోస్ట్మార్టం రిపోర్ట్.. ఆందోళన కలిగిస్తున్న అంశాలు
- వెలుగులోకి తమిళనాడు లాకప్ డెత్ పోస్ట్మార్టం రిపోర్ట్
- ఆందోళన కలిగిస్తున్న అంశాలు
- తీవ్రమైన గాయాలు కారణంగానే చనిపోయినట్లుగా నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జరిగిన కస్టోడియల్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దొంగతనం కేసులో ఆలయ గార్డును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చావబాదారు. పోలీసులు ఇష్టానురీతిగా కొట్టడంతో అజిత్ కుమార్(28) ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దీంతో విపక్ష పార్టీలు.. డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్రం లాకప్ డెత్లకు మాతృభూమిగా మారిపోయిందంటూ ధ్వజమెత్తాయి. తక్షణమే స్టాలిన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా మద్రాస్ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఒక పౌరుడిని ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినంటూ ట్రీట్ చేస్తారా? అంటూ ప్రశ్నించింది. ఇక పెను దుమారం చెలరేగడంతో స్టాలిన్ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు.
ఇది కూడా చదవండి: Kaleshwaram : కాళేశ్వరం వద్ద ప్రాణహిత నదిలో వరద ఉధృతి
Also Read
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ఇక తాజాగా అజిత్ కుమార్కు సంబంధించిన పోస్టుమార్టం వెలుగులోకి వచ్చింది. శరీరంపై 44 గాయాలు ఉన్నట్లుగా తేలింది. అంతర్గత గాయాలు కూడా ఉన్నట్లు తేలింది. ఇక 3 సెంటీమీటర్లు లీనియర్ మచ్చ, ఇంకో మూడు చోట్ల సిగరెట్తో కాల్చిన గాయాలు ప్రత్యక్షమైనట్లు శవ పరీక్షలో తేలింది. అంతేకాకుండా నుదిటి, చేతులు, మోకాలి, పాదం, పిరుదుల ప్రాంతంలో కూడా గాయాలు ఉన్నట్లుగా పోస్టుమార్టం నివేదికలో పేర్కొంది. ఇక మెదడు రక్త నాళాలలో రక్తం అధికంగా పేరుకుపోయినట్లు తేలింది.
ఇది కూడా చదవండి: Himachal: హిమాచల్పై జలఖడ్గం.. 63 మంది మృతి.. రూ.400 కోట్ల నష్టం
జూన్ 28న ఆభరణాల దొంగతనం కేసులో శివగంగ పోలీసులు విచారణ కోసం 27 ఏళ్ల అజిత్ కుమార్ అనే ఆలయ గార్డును తీసుకెళ్లారు. అయితే విచారణ పేరుతో ఐదుగురు పోలీసులు చితకబాదారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రహస్యంగా ఒకరు చిత్రీకరించారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా పిలిచి వారిపై కూడా ఇలాగే ప్రతాపం చూపించారు. అజిత్ కుమార్ సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడి నోట్లో.. ఒంటిపై కారం చల్లి చితకబాదారని వాపోయాడు. స్పృహ కోల్పోయి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పాడు.
ఇక ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్లుగా ఎలా చేస్తారని కోర్టు నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత పౌరుడిని చంపేసిందని వ్యాఖ్యానించింది. ఇంత దారుణంగా ఏ ప్రభుత్వం వ్యవహరించద్దని న్యాయస్థానం మండిపడింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి కేసు బదిలీ చేసింది. అంతేకాకుండా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇక స్టాలిన్ స్వయంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సారీ చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజావార్తలు
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!