Central Team: రాష్ట్రానికి కేంద్ర బృందం.. వరద నష్టంపై అంచనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Team: నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం సోమవారం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అక్కడికక్కడే బృందం అంచనా వేస్తుందని అధికారులు తెలిపారు. ఈ బృందంలో వ్యవసాయం, జలవిద్యుత్, ఫైనాన్స్, పవర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ & హైవేస్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (NRSA) అధికారులు ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం (IMCT) ఈ నెల 31న తెలంగాణలో పర్యటించనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని బృందంలో వ్యవసాయం, ఆర్థికం, జలవిద్యుత్, విద్యుత్, రోడ్డు రవాణా, హైవేలు మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) మంత్రిత్వ శాఖలు/డిపార్ట్మెంట్ల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర బృందాన్ని తెలంగాణకు రానున్నట్లు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: Virat Kohli: ఛీ.. ఇదేం ఖర్మ రా బాబు.. ఆఖరికి విండీస్ చేతిలో కూడానా..
Also Read
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
గత వారం తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఆగిపోవడంతో శనివారం సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారితో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఐఎంసిటి పర్యటన ఆధారంగా నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వినతిపత్రం సమర్పించిన తర్వాత కేంద్ర బృందం రెండోసారి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల బృందంతో కలసి కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి వరద పరిస్థితిని వివరించినట్లు కిషన్రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు మరియు వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి, పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు భారీ నష్టాన్ని కలిగించాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. నష్టాన్ని అంచనా వేయడానికి వెంటనే ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపాలని హోంశాఖ కార్యదర్శిని అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం.
Pursuant to the meeting of senior leaders of @BJP4Telangana, Hon’ble Union Minister for Home Affairs Shri @AmitShah Ji has instructed the Home Secretary to immediately despatch a high-powered inter-ministerial team to Telangana for assessment of the damage caused by floods.
The… pic.twitter.com/EJTOH3vydc
— G Kishan Reddy (@kishanreddybjp) July 30, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!