Central Letter to Telangana: NREGSలో అవకతవకలు.. రాష్ట్రానికి కేంద్రం లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల నిర్మాణం), మైనర్ ఇరిగేషన్-ట్యాంకుల పూడిక తీరకు సంబంధించిన పనుల అంచనా, ఆమోదం, అమలులో అవకతవకలు వంటి అంశాలను కేంద్ర బృందం తనిఖీలో బయట పడిందని లేఖలో పేర్కొన్నారు.
read also: Central Letter to Telangana: NREGSలో అవకతవకలు.. రాష్ట్రానికి కేంద్రం లేఖ..
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, అస్థిరమైన కందకాల పనులకు సంబంధించిన.. ఎత్తైన గ్రేడియంట్లు ఉన్న కొండ ప్రాంతాలకు బదులుగా మైదాన ప్రాంతాలలో చేపట్టడం, అవి ఉపయోగపడనీ చోట వుండటం గుర్తించామని తెలిపారు. సాంకేతిక పరమైన ఆమోదం పొందకుండా పనులను చేపట్టారని పేర్కొన్నారు. కమ్యూనిటీ సమాచార బోర్డులు, జాబ్ కార్డ్లు, గ్రామ పంచాయతీలలో సరైన డాక్యుమెంటేషన్ నిర్వహణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ అవకతవకలపై మరింత విచారణ జరపడానికి 15 సెంట్రల్ టీమ్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించాయని లేఖలో పేర్కొన్నారు. గత కేంద్ర బృందం గమనించిన విధంగానే, ఈ బృందాలు లోపాలను గుర్తించాయని తెలిపారు.
వివరణాత్మక నివేదికలను తెలంగాణ ప్రభుత్వంకి ఈ బృందాలు ఇచ్చాయని తెలిపారు. నివేదికలు తీవ్రమైన అవకతవకలను వెల్లడించాయి. ఉపాధి హామీ చట్టంకి వ్యతిరేకంగా పనులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులకు అయిన ఖర్చును తిరిగి చెల్లించాలని తెలిపారు. డిఫాల్టర్లపై క్రిమినల్ అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకోవాలని కోరింది. వారి నుండి రికవరీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. కేంద్ర బృందాలు, మంత్రిత్వ శాఖ హైలైట్ చేసిన అన్ని సమస్యలపై క్షుణ్ణంగా విచారణ జరపాలని, సవివరమైన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ని సెప్టెంబర్ 11 వరకు పంపించాలని లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాల్సి వుంది.
RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..