Central Letter to Telangana: NREGSలో అవకతవకలు.. రాష్ట్రానికి కేంద్రం లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల నిర్మాణం), మైనర్ ఇరిగేషన్-ట్యాంకుల పూడిక తీరకు సంబంధించిన పనుల అంచనా, ఆమోదం, అమలులో అవకతవకలు వంటి అంశాలను కేంద్ర బృందం తనిఖీలో బయట పడిందని లేఖలో పేర్కొన్నారు.
read also: Central Letter to Telangana: NREGSలో అవకతవకలు.. రాష్ట్రానికి కేంద్రం లేఖ..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, అస్థిరమైన కందకాల పనులకు సంబంధించిన.. ఎత్తైన గ్రేడియంట్లు ఉన్న కొండ ప్రాంతాలకు బదులుగా మైదాన ప్రాంతాలలో చేపట్టడం, అవి ఉపయోగపడనీ చోట వుండటం గుర్తించామని తెలిపారు. సాంకేతిక పరమైన ఆమోదం పొందకుండా పనులను చేపట్టారని పేర్కొన్నారు. కమ్యూనిటీ సమాచార బోర్డులు, జాబ్ కార్డ్లు, గ్రామ పంచాయతీలలో సరైన డాక్యుమెంటేషన్ నిర్వహణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ అవకతవకలపై మరింత విచారణ జరపడానికి 15 సెంట్రల్ టీమ్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించాయని లేఖలో పేర్కొన్నారు. గత కేంద్ర బృందం గమనించిన విధంగానే, ఈ బృందాలు లోపాలను గుర్తించాయని తెలిపారు.
వివరణాత్మక నివేదికలను తెలంగాణ ప్రభుత్వంకి ఈ బృందాలు ఇచ్చాయని తెలిపారు. నివేదికలు తీవ్రమైన అవకతవకలను వెల్లడించాయి. ఉపాధి హామీ చట్టంకి వ్యతిరేకంగా పనులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులకు అయిన ఖర్చును తిరిగి చెల్లించాలని తెలిపారు. డిఫాల్టర్లపై క్రిమినల్ అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకోవాలని కోరింది. వారి నుండి రికవరీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. కేంద్ర బృందాలు, మంత్రిత్వ శాఖ హైలైట్ చేసిన అన్ని సమస్యలపై క్షుణ్ణంగా విచారణ జరపాలని, సవివరమైన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ని సెప్టెంబర్ 11 వరకు పంపించాలని లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాల్సి వుంది.
RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
తాజావార్తలు
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
-
Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..