Munugode bypoll: మునుగోడు సభపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో బీజేపీ నిర్వహించే బహిరంగ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 21న రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడు సభకు అమిత్ షా హాజరు అవుతారని, ఆయన సమక్షంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని తెలిపారు. మునుగోడు సభను అమిత్ షా హాజరుకు వీలుగా ఉండేలా నిర్వహిస్తున్నామని, అందుకు ఆయనకు ఆగస్టు 21తో పాటు 29వ తేదీని కూడా సూచించినట్లు చెప్పారు. చివరగా 21నే సభ ఖరారైందని వివరించారు బండి సంజయ్.. మరోవైపు, తెలంగాణ రాజకీయాలన్ని ఇప్పుడు మునుగోడు బైపోల్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీజేపీ చేరికల కమిటీ నియోజకవర్గంలో యాక్టివ్ అయింది. టీఆర్ఎస్ అసమ్మతి నేతలకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also: RSS: ప్రొఫైల్ పిక్చర్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
మునుగోడు ఉప ఎన్నికకు ఒక వ్యుహం ప్రకారం కార్యాచరణతో బీజేపీ ముందుకెళ్తోంది. రాజగోపాల్రెడ్డి రాజీనామా, అది ఆమోదించే నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర మునుగోడుకు చేరుకునేలా ప్లాన్ చేశారు. ఆ నియోజవర్గ పరిధిలోని చౌటుప్పల్లో సభ నిర్వహించారు. అమిత్ షా నుంచి బండి సంజయ్ వరకు ఇప్పుడు అందరూ దృష్టి మునుగోడు పైనే కేంద్రీకరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. చౌటుప్పల్, నారాయణపూర్, గట్టుప్పల్, చండూర్, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ మండలాలు కాగా.. చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఇక్కడ పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికలకు సిద్ధం చేసేందుకు రాష్ట్ర నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. మునుగోడు ఉపఎన్నికను కేంద్రపార్టీ నేరుగా పర్యవేక్షించనుంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా మునుగోడులో పాదయాత్రతో రంగంలోకి దిగారు. ఈనెల 16 నుంచి గ్రామాల వారీగా రచ్చబండ నిర్వహించబోతున్నారు. మొత్తంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , సీఎం కేసీఆర్ బహిరంగ సభలు వరుస రోజుల్లో జరుతుండటం మునుగోడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
తాజావార్తలు
-
Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
-
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!