KTR Twitter: ఆ పరిశ్రమకు కాంగ్రెస్ అండగా నిలవాలి.. కేటీఆర్ విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Twitter: సిరిసిల్ల గార్మెంట్ పరిశ్రమ సంక్షోభంపై వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొన్ని పేపర్ కటింగ్స్ పోస్ట్ చేస్తూ.. పదేళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అత్యున్నత నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నాయకులు ఎదగడమే కాకుండా తమ కార్యకలాపాలను కూడా విస్తరించుకున్నారని గుర్తు చేశారు. పదేళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వం ప్రారంభించిన పలు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఈ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సహకరిస్తే తమిళనాడులోని తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలమని సిరిసిల్ల నేతన్న అన్నారు. చేనేత రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు.
Also Read
Read also: Supreme Court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
The homegrown talented power loom weavers of Siricilla have seen great growth & expansion since the formation of Telangana with the active support of state Government
My request to the Congress Government is to continue and strengthen the sector more as it has the potential to… pic.twitter.com/xmXlQZ4R6u
— KTR (@KTRBRS) January 16, 2024
సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడిన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా టెక్స్టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ యజమానులు కొత్త నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదని నేతన్నలు వెల్లడించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాల తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు. పరిశ్రమలో పని లేక కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం పేరుతో పాలిస్టర్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన పవర్లూమ్ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యాజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
Health Tips : మీరు పింగాణి కప్పుల్లో టీ, కాఫీ తాగుతున్నారా? ఇవి తప్పకుండా తెలుసుకోవాలి..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!