Sabitha Indra Reddy: ఆ వార్తలు అవాస్తవం.. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా..
- పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
- సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy: తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా.. మరికొంత మంది కీలక గులాబీ నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
Read Also: Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..
Also Read
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ సముచితమైన స్థానం కల్పించారని, పార్టీ మారాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ఏ మాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. సొంత గూటికి చేరుకునేందుకు.. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని.. ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె తన కుమారునితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు జోరుగా వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
— Sabitha Reddy (@BrsSabithaIndra) June 30, 2024
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!