Parliament: నేటి నుంచి పార్లమెంట్ సెషన్స్ తిరిగి ప్రారంభం.. నీట్, ఈడీలపై చర్చకు విపక్షాల పట్టు..
- నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం..
- నీట్ వివాదంపై చర్చ జరపాలని ఇండియా కూటమి డిమాండ్..
- ధన్యవాద తీర్మానంపై చర్చకు ముందు ఎలాంటి చర్చలు జరిపే ఛాన్స్ లేదు: కేంద్ర ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి లోక్సభ సమావేశాల్లో తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కానీ, కేంద్ర సంస్థల దుర్వినియోగం, నీట్, అగ్నిపథ్ లాంటి అంశాల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఛాన్స్ ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై నేడు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో నిరసన తెలపాలని నిర్ణయించారు. అలాగే, నీట్ పేపర్ లీకేజీపై తొలి చర్చ జరపాలని విపక్ష ఇండీ కూటమి డిమాండ్ చేస్తుండటంతో దానికి అంగీకరించబోమని మోడీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also: Shatrughan Sinha: ఆసుపత్రిలో శత్రుఘ్న సిన్హా.. పరుగెత్తిన కొత్త పెళ్లి కూతురు సోనాక్షి!
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
అయితే, పార్లమెంట్ ప్రారంభమైన తొలి రోజు సమావేశాల్లో ప్రమాణస్వీకారంతోనే అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం స్టార్ట్ అయింది. ప్రమాణ స్వీకారం పూర్తైన వెంటనే, ఎన్డీయే ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజ్యాంగాన్ని రక్షించండి వర్సెస్ ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించడంతో గొడవ ప్రారంభమైంది. ఇక, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్సభలో ఆసాన్ తీసుకొచ్చిన తీర్మానంతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించి ప్రస్తవించడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Read Also: Medigadda: మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం
ఇక, ప్రస్తుతం పార్లమెంట్ లో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నీట్పై చర్చిద్దామని విపక్షాలు పట్టుబడుతుండగా.. ధన్యవాద తీర్మానంపై చర్చకు ముందు ఎలాంటి చర్చలు జరిపే సంప్రదాయం లేదని మోడీ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మంగళవారం లోక్సభలో, బుధవారం రాజ్యసభలో చర్చకు ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉంది. నేడు (సోమవారం) పార్లమెంట్ ప్రారంభానికి ముందు, ప్రతిపక్ష ఇండియా బ్లాక్లోని పార్టీలు, ఎన్డీయే కూటమి ప్రభుత్వం వేర్వేరు సమావేశాలను నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ధన్యవాద తీర్మానంపై చర్చను అంగీకరించాలా లేదా నీట్ అంశంపై మొదటి చర్చించాలా అనే దానిపై విపక్షాలు నిర్ణయిస్తాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!