BRS: బీఆర్ఎస్ లేఖల పర్వం.. కేటీఆర్ ప్రధాని మోడీకి.. కవిత ఏపీ సీఎంకు..!
- కేంద్రానికి కేటీఆర్ లేఖ
- ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ
- కేంద్రంపై విరుచుకుపడిన కేటీఆర్
BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను 2014లో చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయడం ద్వారా భద్రాచల రామాలయ భూములు ఏపీ హద్దుల్లోకి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
Also Read
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
ఈ భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేసిన రామాలయ ఈఓపై దాడి జరిగిన విషయాన్ని ఆమె హైలైట్ చేశారు. “రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ, అదే రాముడి ఆలయాన్ని ముంచే కుట్రలు చేస్తోంది” అంటూ విమర్శించారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె కోరారు.
ఇదే సమయంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో బీజేపీ తెలంగాణ ఉనికి పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువచేసే విధంగా ఉందన్నారు.
“మన చరిత్ర తుడిచివేయబడితే, మనం ఎవరం?” అంటూ ప్రశ్నించిన కేటీఆర్, బీజేపీ ఉద్దేశాలు స్పష్టంగా చెప్పాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇది పార్టీ నిబంధనల్లో భాగమా, లేక ఒక వ్యక్తిగత అభిప్రాయమా అన్న దానిపై సమాధానం కోరారు. నిజమే అయితే, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
VC Sajjanar : కాసులకు కక్కుర్తి.. సెలబ్రిటీలపై సజ్జనార్ షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో