BRS: బీఆర్ఎస్ లేఖల పర్వం.. కేటీఆర్ ప్రధాని మోడీకి.. కవిత ఏపీ సీఎంకు..!
- కేంద్రానికి కేటీఆర్ లేఖ
- ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ
- కేంద్రంపై విరుచుకుపడిన కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను 2014లో చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయడం ద్వారా భద్రాచల రామాలయ భూములు ఏపీ హద్దుల్లోకి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
Also Read
- Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
- KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
- Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
Canada: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు, భారతీయ విద్యార్థి మృతి.
ఈ భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునే ప్రయత్నం చేసిన రామాలయ ఈఓపై దాడి జరిగిన విషయాన్ని ఆమె హైలైట్ చేశారు. “రాముడి పేరు చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ, అదే రాముడి ఆలయాన్ని ముంచే కుట్రలు చేస్తోంది” అంటూ విమర్శించారు. యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని ఆమె కోరారు.
ఇదే సమయంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో బీజేపీ తెలంగాణ ఉనికి పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువచేసే విధంగా ఉందన్నారు.
“మన చరిత్ర తుడిచివేయబడితే, మనం ఎవరం?” అంటూ ప్రశ్నించిన కేటీఆర్, బీజేపీ ఉద్దేశాలు స్పష్టంగా చెప్పాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇది పార్టీ నిబంధనల్లో భాగమా, లేక ఒక వ్యక్తిగత అభిప్రాయమా అన్న దానిపై సమాధానం కోరారు. నిజమే అయితే, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
VC Sajjanar : కాసులకు కక్కుర్తి.. సెలబ్రిటీలపై సజ్జనార్ షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
-
NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
-
Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
-
Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
-
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!