Arepally Mohan: బీజేపీలో భారీ చేరికలు.. నేడు ఆరెపల్లి మోహన్ తోపాటు బీఆర్ఎస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arepally Mohan: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరనున్నారు. ఆరేపల్లి మోహన్తో పాటు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, బీఆర్ఎస్కు చెందిన 100 మంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరనున్నారు. అనుచరులతో కలిసి కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్ను కలిశారు. దాదాపు అరగంటపాటు సంజయ్తో సమావేశమైన ఆరెపల్లి మోహన్.. పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Read also: Rohit Sharma: రికార్డులపై ఎక్కువగా దృష్టి పెట్టను.. అలా చేస్తే..: రోహిత్ శర్మ
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
కాగా, 2009లో మానకొండూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరెపల్లి మోహన్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన మోహన్.. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కొందరిని మారుస్తారని తెలిసిన మోహన్ తనకు మానకొండూరు లేదా చొప్పదండి టిక్కెట్టు కేటాయిస్తారని ఆశించారు. అయితే, అలా జరగలేదు. ఈసారి కూడా టికెట్ దక్కకపోవడంతో ఆరెపల్లి మోహన్ అసంతృప్తితో ఉన్నారు. మానకొండూరు నుంచి సిట్టింగ్ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తానన్న హామీ లభించకపోవడంతో మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి మానకొండూరు టికెట్ వస్తుందని ఆరెపల్లి మోహన్ ఆశిస్తున్నారు. దాదాపుగా ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికను బీజేపీ వేగవంతం చేసింది. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
-
Dileep Raj Death: కన్నడ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!