Boora Narsaiah Goud: ఒక రైతు బందు పెట్టి.. పది పథకాలు రద్దు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boora Narsaiah Goud Fires On Telangana Govt Over Rythu Bandhu: బీజేపీ నేత బూర నర్సయ్య తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఒక రైతు బందు పథకం పెట్టి, పది పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. ఇది రైతు బందు కాదు, భూమి బందు అని ఎద్దేవా చేశారు. కేంద్రం అందిస్తోన్న రైతు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందనీయడం లేదని, రైతు రుణమాఫీ కూడా చేయడం లేదని ఆరోపణలు చేశారు. ఆయిల్ ఫార్మ్కు కేంద్రం సబ్సిడీ ఇస్తోందని, ఈ విషయాన్ని రైతులకు ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. 2014 భారతదేశం అప్పు కేవలం రెండింతలు మాత్రమే పెరిగితే.. తెలంగాణ అప్పు ఆరు రెట్లు పెరిగిందన్నారు. మూడు చెక్ డ్యాంలు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మోడీ ‘గతి శక్తి’ని నమ్ముకుంటే.. కేసీఆర్ ఉచిత శక్తిని వాడుకున్నారని విమర్శించారు. ఎంబీబీఎస్ సీట్ల ఫీజు తగ్గడానికి, ఎక్కువ రాంక్ వచ్చిన వారికి సీట్లు రావడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కోటి ఓట్లు.. 90 సీట్లు.. ప్రగతి భవన్లో స్లాట్.. ఇప్పుడిదే బీజేపీ నినాదమని తెలిపారు.
Asaduddin Owaisi: 2024లో నుపుర్ శర్మ ఢిల్లీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
ఇంతకుముందు కూడా.. ఉపాధిహామీ పథకం తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారిందని బూర నర్సయ్య గౌడ్ ధ్వజమెత్తారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం ‘రైతు వ్యతిరేక’మని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ అని పేరు పెట్టడమేంటని నిలదీశారు. తెలంగాణ తల్లి పేరు మీద న్యూట్రీషియన్ కిట్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో కేవలం ఒక కుటుంబం కోసమే రాజకీయ వెట్టి చాకిరి ఉంటుందని.. కేసీఆర్ ఆడిక్షన్ నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులు పొందే అవకాశం కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. బీజేపీలో వ్యక్తి కాదని.. పార్టీయే ముఖ్యమని బూర నర్సయ్య పేర్కొన్నారు.
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!