Weather Warning: పెరిగిన ఉష్ణోగ్రతలు.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి ఐఎండి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Warning: వేసవి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత భానుడు భగభగ మండుతుండటంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడంతో.. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మార్చిలోనే రికార్డు స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. అయితే.. మార్చి చివరి నాటికి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజాగా.. మధ్యాహ్నం నుంచి భారీ వడగళ్ల వాన కురుస్తోంది.
Read also: Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
రహదారుల వద్ద సిగ్నల్స్ వద్ద వాహనదారులు నరకయాతన పడుతున్నారు. తాజాగా.. ఎండలో నడిచే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండకు గురికావడం వల్ల పొడిబారడం, ఎరుపుదనం, తలనొప్పి, దురద, వాంతులు మరియు స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. బీపీ, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఓఆర్ ఎస్ ద్రావణం లేదా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం తీసుకుంటే… చెమట రూపంలో పోగొట్టుకున్న లవణాలు తిరిగి శరీరానికి అందుతాయి. రోజూ సూర్యోదయానికి ముందు వ్యాయామం చేయడం మంచిదన్న సంగతి తెలిసిందే.. మాంసాహారం ఎక్కువగా తింటే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
North Korea: యుద్ధానికి సిద్ధం.. కమాండర్లతో నార్త్ కొరియా అధ్యక్షుడు భేటీ..?
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!