Navneet kaur: జహీరాబాద్లో బీజేపీ తరపున నవనీత్ కౌర్ ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బీజేపీ నేతల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రముక బీజేపీ నేత, తమిళనాడు చీఫ్ అన్నామలై తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలుగు వారికి సుపరిచితమైన, టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న నవనీత్ కౌర్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు.
Read Also: Maharashtra: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్కి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. నిన్న ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేస్తూ, బీబీ పాటిల్ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఆమె మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో బీబీ పాటిల్ తన నియోజకవర్గంలో పనిచేయడం తాను చూశానని అన్నారు. ఈ సారి బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలువందల స్థానాల్లో జహీరాబాద్ కూడా ఒకటని ఆమె చెప్పారు. కాంగ్రెస్కి ఓటేయడం అంటే పాకిస్తాన్కి ఓటేయడమని, దాన్ని ఎదురించేందుకే తాను వచ్చానని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు మాత్రమే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అంటారని దుయ్యబట్టారు. గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన క్రెడిట్ బీజేపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. ఎస్సీ/ఎస్టీలను గౌరవించే వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఉన్న 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా మోడీని గద్దె దించడమే ధ్యేయంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!