Maharashtra: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్సీపీ ( ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో కాంగ్రెస్కు చాలా పార్టీలు దగ్గరవుతాయని ప్రతిపక్ష సీనియర్ నేత అన్నారు. ఇది మాత్రమే కాదు, వారిలో కొందరు కాంగ్రెస్లో తమ పార్టీలను కూడా విలీనం చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఇక, ఇది మీ పార్టీకి కూడా వర్తిస్తుందా అని శరద్ పవార్ని అడిగినప్పుడు.. దీనిపై పవార్ రిప్లై ఇస్తూ.. ‘కాంగ్రెస్కి, నా పార్టీకి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు.. సైద్ధాంతికంగా మనం గాంధీ, నెహ్రూల పంథానే అనుసరిస్తాం.. నేనేమీ ఇప్పుడే చెప్పను.. పార్టీలోని అందరితో మాట్లాడకుండా ఏలాంటి హామీ ఇవ్వడం కుదరదు అని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.
Read Also: KTR: నీకు దమ్ముందా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కాగా, సైద్ధాంతికంగా మేం కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నాం అని ఎన్సీపీ (ఎస్పీ) శరద్ పవార్ తెలిపారు. ఏదైనా నిర్ణయం సమిష్టిగా మాత్రమే తీసుకోబడుతుంది.. నరేంద్ర మోడీతో రాజీ పడటం కష్టం అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మిత్రపక్షమైన ఉద్ధవ్ సేన గురించి కూడా మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే సానుకూల నాయకుడు.. ఆయన ఆలోచనా విధానం మాకు అర్థమైంది.. అతనికి మనలాంటి అభిప్రాయాలే ఉన్నాయన్నారు.
Read Also: Swim Suits : మండుతున్న సూరీడు.. పొట్టి బట్టలకు భారీగా పెరిగిన డిమాండ్
అయితే, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా అండర్ కరెంట్ ఉందని శరద్ పవార్ ఒక పెద్ద జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీని ఇష్టపడని పార్టీలు చాలానే ఉన్నాయి.. కాబట్టి ఈ వ్యక్తులు కలిసి రావొచ్చు.. ఇప్పుడు దేశ మూడ్ మోడీకి వ్యతిరేకంగా మారింది.. ఈ ఎన్నికలు 2014, 2019కి భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. ఇక, తొలిసారిగా ఓటు వేయబోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది.. వీరికి మోడీ ప్రభుత్వం అంటే పెద్దగా ఇష్టం లేదన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన అనేక పార్టీల నాయకత్వం ఇప్పుడు రెండో తరం చేతిలో ఉన్న తరుణంలో శరద్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. ఇక, ఈ విషయాన్ని పవార్ బహిరంగంగా చెప్పకపోయినా.. కానీ, ఖచ్చితంగా తన పార్టీ కాంగ్రెస్లో విలీనం కావచ్చని సూచనలు మాత్రం ఇచ్చారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!