Maharashtra: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్సీపీ ( ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాబోయే కొన్నేళ్లలో కాంగ్రెస్కు చాలా పార్టీలు దగ్గరవుతాయని ప్రతిపక్ష సీనియర్ నేత అన్నారు. ఇది మాత్రమే కాదు, వారిలో కొందరు కాంగ్రెస్లో తమ పార్టీలను కూడా విలీనం చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఇక, ఇది మీ పార్టీకి కూడా వర్తిస్తుందా అని శరద్ పవార్ని అడిగినప్పుడు.. దీనిపై పవార్ రిప్లై ఇస్తూ.. ‘కాంగ్రెస్కి, నా పార్టీకి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు.. సైద్ధాంతికంగా మనం గాంధీ, నెహ్రూల పంథానే అనుసరిస్తాం.. నేనేమీ ఇప్పుడే చెప్పను.. పార్టీలోని అందరితో మాట్లాడకుండా ఏలాంటి హామీ ఇవ్వడం కుదరదు అని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.
Read Also: KTR: నీకు దమ్ముందా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కాగా, సైద్ధాంతికంగా మేం కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నాం అని ఎన్సీపీ (ఎస్పీ) శరద్ పవార్ తెలిపారు. ఏదైనా నిర్ణయం సమిష్టిగా మాత్రమే తీసుకోబడుతుంది.. నరేంద్ర మోడీతో రాజీ పడటం కష్టం అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మిత్రపక్షమైన ఉద్ధవ్ సేన గురించి కూడా మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రే సానుకూల నాయకుడు.. ఆయన ఆలోచనా విధానం మాకు అర్థమైంది.. అతనికి మనలాంటి అభిప్రాయాలే ఉన్నాయన్నారు.
Read Also: Swim Suits : మండుతున్న సూరీడు.. పొట్టి బట్టలకు భారీగా పెరిగిన డిమాండ్
అయితే, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా అండర్ కరెంట్ ఉందని శరద్ పవార్ ఒక పెద్ద జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీని ఇష్టపడని పార్టీలు చాలానే ఉన్నాయి.. కాబట్టి ఈ వ్యక్తులు కలిసి రావొచ్చు.. ఇప్పుడు దేశ మూడ్ మోడీకి వ్యతిరేకంగా మారింది.. ఈ ఎన్నికలు 2014, 2019కి భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. ఇక, తొలిసారిగా ఓటు వేయబోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంది.. వీరికి మోడీ ప్రభుత్వం అంటే పెద్దగా ఇష్టం లేదన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత ఏర్పడిన అనేక పార్టీల నాయకత్వం ఇప్పుడు రెండో తరం చేతిలో ఉన్న తరుణంలో శరద్ పవార్ ఈ కామెంట్స్ చేశారు. ఇక, ఈ విషయాన్ని పవార్ బహిరంగంగా చెప్పకపోయినా.. కానీ, ఖచ్చితంగా తన పార్టీ కాంగ్రెస్లో విలీనం కావచ్చని సూచనలు మాత్రం ఇచ్చారు.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!