Navneet kaur: జహీరాబాద్లో బీజేపీ తరపున నవనీత్ కౌర్ ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navneet kaur: తెలంగాణలో మెజారిటీ స్థానాలు సాధించే లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు సాధించిన కాషాయ పార్టీ, ఈ సారి తెలంగాణలో 17 సీట్లకు గానూ డబుల్ డిజిల్ సీట్లను సాధించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ బీజేపీ నేతల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ప్రముక బీజేపీ నేత, తమిళనాడు చీఫ్ అన్నామలై తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా తెలుగు వారికి సుపరిచితమైన, టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్న నవనీత్ కౌర్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్నారు.
Read Also: Maharashtra: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
Also Read
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- KTR: "23 లక్షల మందికి మానసిక క్షోభ".. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్..
- Telangana Liquor Shop Scam: "పేరు దళితులది.. దందా సిండికేట్లది".. లిక్కర్ షాపుల్లో బినామీల గుట్టురట్టు
- S*uicide: తండ్రి దినకర్మ రోజే తనయుడు ఆత్మహత్య.!
జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్కి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. నిన్న ఆమె బీజేపీ తరుపున ప్రచారం చేస్తూ, బీబీ పాటిల్ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఆమె మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో బీబీ పాటిల్ తన నియోజకవర్గంలో పనిచేయడం తాను చూశానని అన్నారు. ఈ సారి బీజేపీ 400 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలువందల స్థానాల్లో జహీరాబాద్ కూడా ఒకటని ఆమె చెప్పారు. కాంగ్రెస్కి ఓటేయడం అంటే పాకిస్తాన్కి ఓటేయడమని, దాన్ని ఎదురించేందుకే తాను వచ్చానని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు మాత్రమే రాజ్యాంగాన్ని రద్దు చేయాలని అంటారని దుయ్యబట్టారు. గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన క్రెడిట్ బీజేపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. ఎస్సీ/ఎస్టీలను గౌరవించే వారు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు.
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఉన్న 543 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం సాధించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా మోడీని గద్దె దించడమే ధ్యేయంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
-
Bangladesh: ‘‘ముళ్ల కంచెలు మమ్మల్ని ఆపలేవు’’.. సువేందు ప్రకటనపై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Campa Cola vs Coca-Cola: ‘కోలా వార్’లో కొత్త మలుపు.. అంబానీ ‘క్యాంపా’ దెబ్బకు కోక్, పెప్సీ షాక్! ఫ్రీగా రిఫ్రిజిరేటర్లు..
-
CM Vijay: బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారో.. విజయ్ పార్టీ వార్నింగ్..
-
Tamil Nadu: ఫ్లోర్ టెస్ట్కు ముందు కీలక పరిణామం.. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!