Ramchander Rao : జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్ గా ఇద్దాం
- GHMC వైఫల్యాలపై మండిపడ్డ రామచందర్ రావు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS కి గుణపాఠం చెబుదాం
- రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారని ఆరోపణ
- జూబ్లీహిల్స్ విజయాన్ని మోదీకి బహుమతిగా ఇద్దామన్న బీజేపీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : హైదరాబాద్ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రామచందర్ రావు, “డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి, మ్యాన్హోల్స్ నోళ్లు తెరిచి ఉన్నాయి. వర్షాకాలం ప్రమాదాలపై ముందుగానే హెచ్చరించినా GHMC అధికారులు స్పందించడం లేదు. ఇది చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుంది” అని మండిపడ్డారు. ప్రభుత్వంపై కూడా దాడి చేసిన ఆయన, “ప్రజల ప్రాణాలు పణంగా పెట్టినా కళ్ళు తెరవడం లేదు” అని విమర్శించారు.
SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, “రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారు. మజ్లీస్ మద్దతుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరహా ఓటు చోరీతోనే హైదరాబాద్ పార్లమెంట్లో MIM గెలుస్తోంది” అని ఆరోపించారు. BRSపై మాట్లాడుతూ, “ఆ పార్టీ గురించి బాధపడాల్సిన పనిలేదు. ఆస్తుల కోసం ఆ పార్టీ నేతల కుటుంబంలోనే కలహాలు ముదురుతున్నాయి” అన్నారు. మరోవైపు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర పథకాలను కూడా తమవిగా చూపి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. “జూబ్లీహిల్స్ ఉపఎన్నికను గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్గా అందించాలి” అని బీజేపీ కార్యకర్తలకు రామచందర్ రావు పిలుపునిచ్చారు.
Alleti Maheshwar Reddy : ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం
తాజావార్తలు
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!