Ramchander Rao : జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్ గా ఇద్దాం
- GHMC వైఫల్యాలపై మండిపడ్డ రామచందర్ రావు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS కి గుణపాఠం చెబుదాం
- రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారని ఆరోపణ
- జూబ్లీహిల్స్ విజయాన్ని మోదీకి బహుమతిగా ఇద్దామన్న బీజేపీ చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : హైదరాబాద్ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని సమస్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రామచందర్ రావు, “డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి, మ్యాన్హోల్స్ నోళ్లు తెరిచి ఉన్నాయి. వర్షాకాలం ప్రమాదాలపై ముందుగానే హెచ్చరించినా GHMC అధికారులు స్పందించడం లేదు. ఇది చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుంది” అని మండిపడ్డారు. ప్రభుత్వంపై కూడా దాడి చేసిన ఆయన, “ప్రజల ప్రాణాలు పణంగా పెట్టినా కళ్ళు తెరవడం లేదు” అని విమర్శించారు.
SSMB 29 : భయంకర అడవుల్లో రాజమౌళి, మహేశ్ షూట్.. నమ్రత రియాక్ట్
Also Read
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
- KTR Injured: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద తోపులాట.. కేటీఆర్ నుదుటికి, చేతికి గాయం!
రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, “రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారు. మజ్లీస్ మద్దతుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తరహా ఓటు చోరీతోనే హైదరాబాద్ పార్లమెంట్లో MIM గెలుస్తోంది” అని ఆరోపించారు. BRSపై మాట్లాడుతూ, “ఆ పార్టీ గురించి బాధపడాల్సిన పనిలేదు. ఆస్తుల కోసం ఆ పార్టీ నేతల కుటుంబంలోనే కలహాలు ముదురుతున్నాయి” అన్నారు. మరోవైపు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్నారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ కేంద్ర పథకాలను కూడా తమవిగా చూపి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. “జూబ్లీహిల్స్ ఉపఎన్నికను గెలిచి నరేంద్రమోడీకి గిఫ్ట్గా అందించాలి” అని బీజేపీ కార్యకర్తలకు రామచందర్ రావు పిలుపునిచ్చారు.
Alleti Maheshwar Reddy : ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!