Alleti Maheshwar Reddy : ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నం
- ఒక్కరోజు సమావేశం.. ప్రజా సమస్యలకు తలుపులు మూసిన ప్రభుత్వమా?
- వరదల వల్ల పంట నష్టం, యూరియా కొరతపై చర్చ ఎందుకు దూరం?
- ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగుల సమస్యలపై మౌనమే ఎందుకు?
- బీజేపీ హామీ – అసెంబ్లీలో తప్పక ప్రజా సమస్యలే ప్రధాన చర్చ
Alleti Maheshwar Reddy : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఒక్కరోజే సమావేశాలు ఉంటాయని మంత్రి శ్రీధర్ బాబు, బట్టి గారు ముందే ప్రకటించారని, ఇది ప్రజల సమస్యలపై చర్చను అణగదొక్కే ప్రయత్నమని ఆయన అన్నారు.
Jimmy Gaminlune Mate: సహాయక చర్యల్లో ప్రాణాలు వదలిన అగ్నివీరుడు..
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
వరదల కారణంగా వేల ఎకరాల పంటలు నాశనం అయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కానీ ఆ అంశంపై కూడా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టమైందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా, ముఖ్యమంత్రి దానిపై సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగుల సమస్య, రైతులు మరియు మహిళలకు ఇచ్చిన హామీలు, మాజీ సర్పంచుల బకాయిలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, రెవెన్యూ, విద్యుత్, వైద్య రంగ సమస్యలపై చర్చ జరగాలని బీజేపీ ప్రతిపాదించినా ప్రభుత్వం దానికి సంధానం లేకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు.
కనీసం 30 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ కోరిందని, కానీ ప్రభుత్వం ఒక్కరోజు సమావేశంతోనే సభను ‘బుల్డోజ్’ చేయాలని చూస్తోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అత్యంత కీలకమైన సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమకవసరమైన విషయాలనే ఎంచుకుని చర్చ పెడుతున్నారని విమర్శించారు. “కనీసం ఎన్ని రోజులు అసెంబ్లీ నడుస్తుందో కూడా స్పష్టంగా చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్యలపై చర్చకు రాకుండా గొంతు నొక్కేస్తోంది. రేపు మాత్రం బీజేపీ తరఫున ఈ సమస్యలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావిస్తాం” అని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
Asia Cup 2025: అభిమానులకు కీలక అప్డేట్.. ఆసియా కప్ షెడ్యూల్లో మార్పు!
తాజావార్తలు
-
Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!