Etela Rajender : సఫాయి కర్మచారుల సంక్షేమంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
- కేంద్ర మంత్రులతో బీజేపీ ఎంపీల భేటీ – కీలక అంశాలపై చర్చ
- సఫాయి కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ హామీ – ఎందుకు జాప్యం?
- రైల్వే అభివృద్ధి – వందే భారత్ స్టాప్ సహా కీలక డిమాండ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వారి కాళ్లు కడిగి సత్కరించారు. అయితే, చనిపోయిన సఫాయి కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలనే ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ తదుపరి రైల్వే మంత్రిని కలిసి తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను వివరించారు. సుచిత్ర వద్ద MMTS స్టేషన్ ఏర్పాటు అవసరమని, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని అంశాలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో చర్చించినట్లు తెలిపారు. తమ నియోజకవర్గంలో రైల్వే అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జిల కొరత కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వందే భారత్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని కూడా రైల్వే మంత్రిని కోరారు.
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. హామీలు అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించారు. బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. హామీల అమలును నెరవేర్చేందుకు HCU భూములను అమ్మడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు చెందిన భూములు అమ్మితే నగరంలో పచ్చదనం మరింత తగ్గిపోతుందని హెచ్చరించారు. భూముల్లో పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటవ్వాలి కానీ, భూముల విక్రయం మాత్రం అప్రజాస్వామికమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!