BJP MP K.Laxman: ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రశాంతం గా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K.Laxman: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా వికసిత్ పత్రాన్ని మోడీ గ్యారెంటీ గా ప్రజల ముందు ఉంచామన్నారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ విచ్ఛిన్న రాజకీయాలతో విభజించు భారత్ విధానాలతో వ్యవహరిస్తోందన్నారు. వికసిత్ భారత్, విభజించు భారత్ మధ్యనే ఎన్నికలుంటాయన్నారు. కూటమికి ఓటమి తప్పదని తెలిపోయాక విభజించు భారత్ విధానాన్ని తెర మీదకు తెచ్చారని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానరిచి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచిందన్నారు. అంబేద్కర్ ను గౌరవించి భారత రత్న ఇచ్చిన ఘనత బీజేపీది తెలిపారు. విభజించు పాలించు విధానం కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఉందన్నారు.
Read also: BRS KTR: బీఆర్ఎస్ లోనే గౌరవం ఉందన్న ఈటల మాటను గుర్తుపెట్టుకోండి..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ముస్లిం సంత్రుస్తీకరమైన విధానాలతో కాంగ్రెస్ హిందూ సమాజంపై విషం జిమ్ముతున్నారని తెలిపారు. కాంగ్రెస్ సనాతన ధర్మం వినాశనం కోరుకునే పార్టీ అన్నారు. CAA పట్ల కాంగ్రెస్ కూటమి తప్పుడు విష ప్రచారం చేస్తోందన్నారు. పౌరసత్వం ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిప్పులు పోసుకుంటుందని మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. అధికారంలోకి వస్తె 370 నీ మళ్ళీ తెస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కుల పరమైన రిజర్వేషన్లతో చిచ్చు పెడుతోందన్నారు. బీసీ (ఈ) లోకి ముస్లిoలను తెచ్చి అదనంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిoచడం బీసీలకు అన్యాయం చేసినట్టు కాదా..? అని ప్రశ్నించారు.
Read also: KCR: సోషల్ మీడియాలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
రంగనాథ న్ కమిషన్ 2004 లో ఏర్పాటు చేశారన్నారు. రంగనాథన్ సిఫార్సులను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతోందని మండిపడ్డారు. రిజర్వేషన్, మండల కమిటీలను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు చరిత్ర తెలుసుకోవాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టంగా చెబుతున్నామన్నారు. వారసత్వ సంపద పిల్లలకు చెందాలంటే యాభై శాతం సంపద ప్రభుత్వానికి చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు శ్యాం పిట్రోడ్ చెబుతున్నారని అన్నారు. ఇదెక్కడి న్యాయం.. ఆ యాభై శాతం సంపద ఎవరికి పంచుతారు? అని ప్రశ్నించారు. వారసత్వ సంపదను లాక్కొని ఒక వర్గానికి పంచాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. మత పరమైన రిజర్వేషన్ రద్దు చేస్తాం తప్ప ఇంకెలాంటి రిజర్వేషన్లను రద్దు చేయమని స్పష్టం చేశారు.
Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!