BJP MLA Raja Singh: సంచలన వ్యాఖ్యలు.. ప్రజలు నిలదీస్తారనే ఏరియల్ సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు నిలదీస్తారనే సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడంలేదని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే.. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎంను ప్రశ్నించారు. అంతేకాకుడా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తుందని, అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో కేసీఆర్ సర్కారు ఒక్కసారి కూడా పరిహారం ప్రకటించలేదని మండిపడ్డారు.
కాగా.. పంట పరిహారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లు ఏం చేశారని గతేడాది హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని అన్నారు. ఎప్పడు వరదలు వచ్చిన వేల కోట్లు ప్రకటించడం మినహా ఒక్కపైసా విదల్చలేదని విమర్శించారు. అంతేకాకుండా.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏం చేస్తున్నారో చెప్పాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈనేపథ్యంలో.. వరద బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం, ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Also Read
ఫామ్ హౌస్ నుంచి వరద ప్రాంతాలకు కేసీఆర్ ను గుంజుకొచ్చిన ఘనత బిజెపిదే. రోడ్డు మార్గంలో పోతే ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్ ఆకాశ మార్గాన పోవాలను కుంటున్నారు. వరదలతో జనం గోస పడుతుంటే ఇప్పటిదాకా నష్ట పరిహారం ప్రకటించడం కేసీఆర్ కు చేతకాలేదు.
-శ్రీ @TigerRajaSingh pic.twitter.com/snXIPVsCUf— BJP Telangana (@BJP4Telangana) July 17, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!