BJP MLA Raja Singh: సంచలన వ్యాఖ్యలు.. ప్రజలు నిలదీస్తారనే ఏరియల్ సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు నిలదీస్తారనే సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. వరదలతో జనం గోస పడుతుంటే వరద నష్టం అంచనా, పరిహారం ప్రకటించడంలేదని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అయితే.. కేంద్రమే అన్నీ చేస్తే రాష్ట్రంలో ఇక మీ ప్రభుత్వం ఎందుకని రాజాసింగ్ సీఎంను ప్రశ్నించారు. అంతేకాకుడా.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తుందని, అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో కేసీఆర్ సర్కారు ఒక్కసారి కూడా పరిహారం ప్రకటించలేదని మండిపడ్డారు.
కాగా.. పంట పరిహారానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన వెయ్యి కోట్లు ఏం చేశారని గతేడాది హైకోర్టు మొట్టికాయలు వేసినా టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని అన్నారు. ఎప్పడు వరదలు వచ్చిన వేల కోట్లు ప్రకటించడం మినహా ఒక్కపైసా విదల్చలేదని విమర్శించారు. అంతేకాకుండా.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏం చేస్తున్నారో చెప్పాలని రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఈనేపథ్యంలో.. వరద బాధితులకు వెంటనే నిత్యావసర వస్తువులు, వైద్య సదుపాయాలతో పాటు పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి సాయం, ఉచితంగా విత్తనాలు ఎరువులు అందించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
Also Read
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ఫామ్ హౌస్ నుంచి వరద ప్రాంతాలకు కేసీఆర్ ను గుంజుకొచ్చిన ఘనత బిజెపిదే. రోడ్డు మార్గంలో పోతే ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్ ఆకాశ మార్గాన పోవాలను కుంటున్నారు. వరదలతో జనం గోస పడుతుంటే ఇప్పటిదాకా నష్ట పరిహారం ప్రకటించడం కేసీఆర్ కు చేతకాలేదు.
-శ్రీ @TigerRajaSingh pic.twitter.com/snXIPVsCUf— BJP Telangana (@BJP4Telangana) July 17, 2022
తాజావార్తలు
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!