Maheshwar Reddy: ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే.. మహేశ్వర్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy: ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మ్యానిఫెస్టో చదివినట్లు వుందని మండిపడ్డారు. మ్యానిఫెస్టోకు చట్టబద్ధత ఉండాలన్నారు. కాంగ్రెస్ మొత్తం 412 హామీలు ఇచ్చారని తెలిపారు. ఈ సెషన్ లోనే కాంగ్రెస్ హామీలకు చట్టబద్ధత తీసుకు రావాలన్నారు. ప్రజావాణీ పేరుతో పబ్లిసిటీ చేయాలని చూస్తే బీజేపీ పోరాటం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి రోజు దర్బార్ నడిపిస్తామని చెప్పి…ఇప్పుడు వారానికి రెండు రోజులు అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తామని అన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చారని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో వుంచుకుని హామీలను విస్మరిస్తే పోరాటం చేస్తామన్నారు. అనేక హామీలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ ఇచ్చారని తెలిపారు. రేవంత్ రెడ్డి స్వయంగా రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్తానంలో ఓడిపోయారని తెలిపారు. సీఎంకు పాలనా అనుభవం లేకపోయినా కాంగ్రెస్ సీనియర్ల సలహాలతో ముందుకు వెళ్ళాలని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు.
Read also: Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?
Also Read
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలిపారు. బీజేపీ పక్షాన నూతన రాష్ట్ర ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం వుందన్నారు. అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినట్లుగా కనపడుతుందని తెలిపారు. బడ్జెట్ కు భారంగా కాంగ్రెస్ పార్టీ హామీలు వున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తుందో చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్రను విస్మరించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు రాజ్యసభలో బీజేపీ సంపూర్ణ మద్ధతు తెలిపిందని, సకలజనులతోనే తెలంగాణ ఏర్పాటు అయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక్కటి అవుతామని బిఆర్ఎస్ పార్టీ అంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదన్నారు.
Revanth Reddy: గత చరిత్ర పై చర్చ చేద్దామా..? కేటీఆర్ పై రేవంత్ ఫైర్
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!