Revanth Reddy: గత చరిత్ర పై చర్చ చేద్దామా..? కేటీఆర్ పై రేవంత్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభలో వాడీవేడీ చర్చ సాగుతోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ మాటల యుద్ధం జరిగింది. దీంతో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావ్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగి పడవు అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. కొంత మంది ఎన్ఆర్ఐ లకు ప్రజా స్వామ్య స్ఫూర్తి తెలియదన్నారు. 51 శాతం నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు. సహేతుకంగా విశ్లేషణ చేయాలి ప్రతిపక్షం అన్నారు. అచ్చోసిన ఆంబోతులం ..పోడియం కి వస్తాం అంటే అహం సరికాదంటూ ఫైర్ అయ్యారు. పదే పదే గత పాలన గురించి మట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడుని చేసింది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ని ఎంపీ గా గెలిపించింది కాంగ్రెస్ అన్నారు. కేంద్ర మంత్రి చేసిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడుని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది వైఎస్ అన్నారు.
Read also: Prabhas: మీడియా ముందుకు నీల్ వస్తాడు సరే… మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి?
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
పోతిరెడ్డిపాడు పొక్క పెంచునప్పుడు కొట్లాడింది పీజేఆర్ అన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఆరోజు ఎవరు కొట్లాడలేదన్నారు. మా పార్టీ పీజేఆర్ కొట్లాడారని తెలిపారు. ఏ పాలకుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు అని, ఎలా ఎమ్మెల్యే అయ్యారన్నారు. సిరిసిల్లలో కేటీఆర్, కేసీఆర్ గురువు దయతో ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వచ్చారు కేటీఆర్ ఇక్కడికి అంటూ తెలిపారు. గతం గురించి చర్చ చేద్దాం అంటే..ఒకరోజు సమయం ఇవ్వండన్నారు. సంపూర్ణ చర్చ చేద్దామని తెలిపారు. గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని తెలిపారు. గత చరిత్రలో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామన్నారు. వరంగల్ ఎంకౌంటర్ లకు ఎవరు కారకులు? అని ప్రశ్నించారు. గవర్నర్ కాంగ్రెస్ మేనిఫెస్టో చదివారు అంటున్నారని, మా పాలసీ కి..కేబినెట్ ఆమోదం చేశామన్నారు. తొమ్మిదేళ్ల పాలనపై ఎక్స్ ర్ తీసినట్టు అన్ని బయట పెడతామన్నారు. పిల్లి శాపనర్దాలకు ఉట్లు తెగి పడవంటూ సెటైర్ వేశారు. ఏమి బయపడం.. సలహాలు ఇవ్వండి వింటాం అన్నారు. ప్రతిపక్ష పార్టీలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ అన్నారు.
Purandeswari: పోలవరం ప్రాజెక్టును డబ్బు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి..
తాజావార్తలు
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!