Premender Reddy: మునోగొడుపై ప్రభావం చూపే విధంగా సభ నిర్వహిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Premender Reddy On Amberpet Public Meeting: పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 23,24 తేదీల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఎల్ వర్మ సైతం పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా వాళ్లు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలుస్తారని.. కేంద్ర ప్రభుత్వ నిధుల ఖర్చు, పథకాల అమలు తీరును పరిశీలిస్తారన్నారు. ఈ సందర్భంగానే బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అవుతారన్నారు.
ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయ్యిందని పేర్కొన్న ప్రేమేందర్ రెడ్డి.. రెండో విడత 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రారంభమైనట్లు వెల్లడించారు. బైక్ ర్యాలీలకు మంచి స్పందన వస్తోందని, ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఎంతుందో స్పష్టమవుతోందని చెప్పారు. ప్రధాని మోడీ పుట్టినరోజుని పురస్కరించుకొని.. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ‘సేవా పక్షోత్సవం’ నిర్హిస్తున్నామని, ఇందులో అనేక కార్యక్రమాల్ని చేపట్టనున్నామని అన్నారు. 10 వేల మంది రక్తదాతలతో బ్లడ్ డైరెక్టరీ తయారు చేస్తున్నామని, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
అలాగే.. ఈ నెల 25వ తేదీన దీన దయాళ్ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నామని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్, వోకల్ 2 లోకల్ కార్యక్రమాలూ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టీబీ ముక్త భారత్లో భాగంగా ఒక్కో టీబీ పేషెంట్కు బీజేపీ కార్యకర్తలు వాలెంటర్గా ఉంటారన్నారు. ఇక బండి సంజయ్ సంగ్రామ యాత్ర నాలుగో విడత రేపటితో ముగియనున్న సందర్భంలో.. అంబర్పేటలో భారీఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని, మునోగొడుపై చూపే విధంగా ఈ సభ నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!