తోడేళ్ళుగా విరుచుకుపడుతున్నారు : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్రంలో నిషేధించబడిన పార్టీగా అభివర్ణిస్తున్నారు. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఇంటిలిజెన్స్ పోలీసులు యువకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బీజేపీకి పోతే పెన్షన్ రాదు,రైతు బంధు రాదు,దళిత బంధు రాదని నికృష్ట ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ కూలి పని చేసి ఏమి రేషన్ కార్డు పెన్షన్లు ఇవ్వడని చెబుతున్నాము. నియంతృత్వ ధోరణితో కేసీఆర్ హుజురాబాద్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారుఅని తెలిపారు
ప్రస్తుతం హుజురాబాద్ లో జనం భయంతో బతుకుతున్నారు. జనం ఇబ్బందులు పోలీస్ ఓవర్ యాక్షన్ పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశాం.. కోర్టుకు వెళతాం. దళిత బంధును హుజురాబాద్ లో నోటిఫికేషన్ ముందు అందరికి ఇవ్వాలని కోరినము. ఊరికి 10 మందిని సెలెక్ట్ చేయడం స్థానికంగా లేని వారిని ఆర్థికంగా ఇబ్బందులు లేని వారిని పార్టీ జెండాలు కప్పుకున్నవాళ్లకు ఇవ్వడం దరిద్రపు పద్ధతి. హుజురాబాద్ లోని అన్ని దళిత వాడాలో ప్రభుత్వ నాటకాలు పై శాపనార్ధాలు పెట్టారు. అన్ని మండలాల్లో బిజెపి కార్యకర్తలను,దళిత చైతన్య నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ స్ట్రేషన్ లో పెట్టి అన్నం కూడా పెట్టకుండా ఉంచుతున్నారు.దీనిపై మానవ హక్కుల కమిషన్ కి వెళ్తాము. పద్ధతి మార్చుకుని లేకుంటే మేము తిరగపడతాము అని పేర్కొన్నారు.
Also Read
- Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
- Gold Demand : దక్షిణ భారతీయుల బంగారం సెంటిమెంట్ను మారుతుందా..?
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ఇక ఓ సీడ్ కంపిని డబ్బులు రావని టీఆర్ఎస్ వైపు ఉండాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఎన్నిక సమయంలో అప్పడు ఇలానే చేసిన వారికి కర్రు కాల్చి వాత పెట్టారు. హుజురాబాద్ ఏమన్నా గుత్తా పట్టారా, మేము ఏమన్నా బానిసలమా పిచ్చి పనులు మంచిది కాదు. దళిత బంధుతో పాటు అన్ని వర్గాలకు 10 లక్షలు ఇవ్వాలి. దళిత బంధు కేవలం పేపర్లకే పరిమితి అయితే బండకేసి కొడతారు. ఓట్లు దండుకొని పోతాం అంటే ఇక్కడ ఎవరు అమాయకులు లేని హుజురాబాద్ చైతన్యవంతమైన ప్రాంతం. కేసీఆర్ హరీష్ రావు మనమీద ప్రేమతో ఇవ్వట్లేదు కేవలం ఓట్లకోసమే ఇస్తున్నారు. కుల సంఘాల భవనాలు మహిళా భవనాలు ఇవ్వండి అని తెలిపారు ఈటల.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!