Jithender Reddy: ఆయన రాజకీయంలో ఓ బచ్చా.. మోడీ చిటికెన వేలుకు పనికి రాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jithender Reddy: తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి విమర్శలు కురిపిస్తున్నారు.. మోడీ హామీలు అమలు చేయకపోవడంతో పాటు.. ఆయన పాలనలో చేసింది ఏమీ లేదంటూ పదునైన పదాలతో విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే.. కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజకీయంలో ఓ బచ్చా అని పేర్కొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ చిటికెన వేలుకు కూడా కేటీఆర్ పనికి రాడు అంటూ ఫైర్ అయ్యారు.. నీ వాక్ చాతుర్యం ఎవరి మీద ప్రయోగిస్తున్నారు తెలుసుకుని మాట్లాడు అని హితవుపలికారు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి ఓ సరైన డీపీఆర్ ఇచ్చారా? ఓ సారి జూరాల నుంచి.. మరో సారి నార్లపుర్ నుంచి ప్రాజెక్ట్ ను రూపొందించారు.. అనవసరంగా ఎన్ జీ టి.. కోర్టులకు వెళ్లేలా మీ చర్యలు ఉన్నాయి.. మీ అహంకార వైఖరి వల్లే ఇంత జరిగిందని మండిపడ్డారు. .
Read Also: Red Alert at Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్.. విజిటర్స్ నో ఎంట్రీ
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
కమీషన్ల కోసం రిజర్వాయిర్ లు కట్టారు.. మేం ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇప్పిస్తాం.. కానీ, మా ప్రభుత్వం వచ్చాక.. అంతేకాదు.. వచ్చేది వందకు వందశాతం మా ప్రభుత్వమే ననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి.. మేం ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రాజెక్టును రూపొందిస్తాం.. జాతీయ హోదా సాధిస్తామని ప్రకటించారు.. నీటి వాటా కోసం అప్పట్లోనే సీఎం కేసీఆర్ 299 టీఎంసీలు చాలని ఉమా భారతి ముందు సంతకం చేశారు.. తెలంగాణకు అన్యాయం చేసిన వ్యక్తి సీఎం కేసీఆరేనని ఆరోపించారు.. ఇది, కూడా మేం కృష్ణా నీటి లో 599 టీఎంసీల నీటి కోసం మా ప్రభుత్వము వచ్చాక సాధిస్తాం అన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అసమర్ధ ప్రధాని కాదు.. దేశంలోనే అందరికన్నా సోమరి సీఎం.. సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. నీవు కాదు ప్రధానికి సర్టిఫికేట్ ఇచ్చేది.. మొత్తం ప్రపంచం మోడీని ప్రశంసించిన సందర్భం ఉందన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దాన్ని మోడీ ఆపాడని గప్పాలు కొట్టారని అన్నవు.. గప్పాలు కొట్టేది సీఎం కేసీఆర్.. ఎక్కడు పోయినా గొప్పలు చెప్పుకునే స్థాయి సీఎం కేసీఆర్ ది.. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ, ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు జితేందర్రెడ్డి.
తాజావార్తలు
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
-
Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!