KTR: దెబ్బ అలా ఉంటుంది.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత్ రాష్ట్ర కమిటీ తొలి విజయం సాధించిందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పోరాటంతో కేంద్రం దిగివచ్చిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం కాస్త వెనక్కి తగ్గిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లేది లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించారు. ప్లాంట్ను పూర్తి స్థాయిలో పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడిన ఘనత మన కేసీఆర్ అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. కేసీఆర్ దెబ్బ అలా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read also: Perni Nani vs KTR: కేటీఆర్ కామెంట్లకు పేర్నినాని కౌంటర్.. హరీష్ది మహా తెలివైన బుర్ర..!
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గురువారం ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ముందుకు వెళ్లడం లేదని.. ప్రస్తుతానికి దాని గురించి ఆలోచించడం లేదని, గతంలో ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ప్లాంట్లో కొన్ని కొత్త డిపార్ట్మెంట్లను ప్రారంభిస్తున్నాం.. ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసే ప్రక్రియలో ఉంది.ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం’’ అని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్పై ఆసక్తి చూపడంపై ఫగ్గన్ సింగ్ స్పందించారు. ప్రభుత్వ భాగస్వామ్యం ఒక ఎత్తుగడ మాత్రమేనని.. స్టీల్ ప్లాంట్లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని.. ప్లాంట్ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని.. ముడిసరుకు పెంచే ప్రక్రియపై దృష్టి సారించామని వివరించారు.
125 అడుగులు అంబేడ్కర్ రాజసం.. ప్రత్యేకతలేంటో తెలుసా?
తాజావార్తలు
-
Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!