Bhatti Vikramarka: సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నక్కలగండిలో పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలకు సిద్ధమైన భూ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన 2013 భూ నిర్వాసితుల చట్టంలో భూ నిర్వాసితులకు అన్ని సదుపాయాలు పొందు పర్చామన్నారు. రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితుల సమస్యలు ఉన్నాయని, భూ నిర్వాసితుడు మేము తెలంగాణలో ఉన్నామా, పాకిస్థాన్ లో ఉన్నామా అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియంత పాలన సాగుతుందని అన్నారు. మరో 5 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, కేసిఆర్, కేటీఆర్, హరీశ్ లు వారి తాత ముత్తాతలు కూడా ఆపలేరని నిప్పులు చెరిగారు.
Read also: రూట్ మార్చిన కేరళ కుట్టి.. అనుపమ సూపర్ హాట్ షో
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
కేసిఆర్ ఆలోచన పోయిందా, మెదడు పోయిందా అర్థం కావడం లేదు, రెవెన్యూ చట్టం మొఘలుల పాలన నుండి రూపాంతరం చెందుతు వస్తుందన్నారు. భూ రికార్డులను భద్ర పరిచే రెవెన్యూ చట్టాన్ని చిన్నాభిన్నం చేశాడని అన్నారు. కేసీఆర్ ధరణి పేరుతో భూ కుంభకోణానికి పాలడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలకులు గాడిదలు కాస్తున్నారా,కాంగ్రెస్ హయాంలో ఎసెల్బీసీ సొరంగం పనులు చేపట్టి 30 కిలో మీటర్లు చేపడితే బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో 2,3 కిలోమీటర్లు తొవ్వారని అన్నారు. నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సోయిలేని పాలకులు మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సొరంగం పనులు కనిపిస్తాయన్నారు. జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా మంత్రా దిష్టిబొమ్మనా, ఎందుకు కేసిఆర్ ను నల్గొండ ప్రాజెక్టుల గురించి అడగడం లేదని తెలిపారు.
రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లకోసం తొమ్మిదేళ్ళ పాలనలో నల్గొండ జిల్లాకు ఒక్క ఏకరానికైన నీరు ఇచ్చారా, ఏమి సాధించారని సాగునీటి ఉత్సవాలు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పాలకులు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల వద్ద ఫోటోలు దిగుతున్నారని మండిపడ్డారు. సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉంది? అంటూ ప్రశ్నించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా గుత్తా ఏమి తెచ్చాడు, ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి, కేసిఆర్ ను కలవడానికి భయపడతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నల్గొండ జిల్లా నేతలు సీఎం పక్కన కూర్చుని ఇక్కడి సమస్యలు పరిష్కారం చేశేవారని, కానీ ఇప్పటి బీఆర్ఎస్ పాలకులు జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ ఏమి చేసింది, మీరు ఏమి చేసారో తేల్చుకుందాం రండి, నల్గొండ జిల్లా పర్యటనలో ఒక్కో రోజు మీది ఒక్కో కథ చెబుతా అంటూ సవాల్ విసిరారు.
మగవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే.. ఆ విషయంలో వీక్ అయినట్లే
తాజావార్తలు
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!